ఉరేసుకుని వివాహిత బలవన్మరణం
చీరతో ఉరివేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుమార్తె మంగమ్మ (38)కు దాచారం గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకన్నకు చాలా ఏళ్ల కిందట వివాహమైంది.
నేరేడుచర్ల, న్యూస్టుడే: చీరతో ఉరివేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుమార్తె మంగమ్మ (38)కు దాచారం గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకన్నకు చాలా ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కూతురు సంతానం. భర్త మాజీ ఎంపీటీసీ సభ్యుడు. మంగమ్మ తల్లి మల్లమ్మ జ్వరం వస్తుండటంతో చూసేందుకు కూతురితో కలిసి ముకుందాపురంలోని ఇంటికి వచ్చింది. తర్వాత భర్త సైతం వచ్చారు. మధ్యాహ్నం తర్వాత భర్త, కూతురు దాచారం వెళ్లిపోయారు. రాత్రి తల్లికూతుళ్లు కలిసి భోజనం చేసి వేర్వేరు గదుల్లో నిద్రించారు. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కూతురు మంగమ్మ ఉరి వేసుకుని మరణించి కనిపించింది. ఆమె హైదరాబాద్లోని కుమారులకు, మృతురాలి భర్త వెంకన్నకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహన్ని శవ పరీక్షకు తరలించారు. మృతురాలి సోదరుడు వెంకన్న తన చెల్లెలు మంగమ్మ కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో మరొకరు..
మద్దిరాల: ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోలుమళ్లలో సోమవారం జరిగింది. స్థానికులు, ఏఎస్సై నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లకు చెందిన పొడుపుగంటి బాలరాజు(32)కు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లకు చెందిన ఉమతో పదేళ్ల క్రితం వివాహమైంది. బాలరాజు మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడుతుండటంతో ఆమె పోలుమళ్లకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాలరాజు సైతం ఐదు నెలలుగా పోలుమళ్లలో భార్యతో ఉంటూ ఆదివారం ఆమెతో గొడవపడ్డారు. ఉమ పుట్టింటికి వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. అతడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఏఎస్సై నాగయ్య తెలిపారు.
వివాహితపై అత్యాచార యత్నం
కేతేపల్లి, న్యూస్టుడే: మండలంలో ఓ వివాహిత(26)పై అత్యాచార యత్నం, వేధింపులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వివాహితపై ఈ నెల 18న అదే గ్రామానికి చెందిన కీర్తి వెంకన్న అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కేతేపల్లి ఎస్సై ఎం.అనిల్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ వివాహితను ఐదేళ్ల నుంచి నిందితుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఎస్సై వివరించారు. ఈనె 18న ఊరి శివారులో ఉన్న ఓ రైతు పొలం పనులకు వెళ్లిన తనను వెంబడిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై అత్యాచార యత్నం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. ఘటనకు సంబంధించి గ్రామంలో నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు విచారణ నిర్వహించారని ఎస్సై వివరించారు. తన భార్యను తరచుగా వేధిస్తున్నాడని 2016 సంవత్సరంలో బాధితురాలి భర్త ప్రస్తుత కేసులో నిందితుడైన వెంకన్నపై హత్యా ప్రయత్నం చేశాడని గతంలో కేసు నమోదైందని ఎస్సై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు