నర్సింహకు ‘ఆర్పీఎఫ్ ఉత్తమ సేవా పతకం’
చౌటుప్పల్కు చెందిన ఉడుగు నర్సింహ గౌడ్ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. ఆయన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ ఉడుగు నర్సింహ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు.
ఉడుగు నర్సింహ
చౌటుప్పల్, న్యూస్టుడే: చౌటుప్పల్కు చెందిన ఉడుగు నర్సింహ గౌడ్ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. ఆయన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ ఉడుగు నర్సింహ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు. 26 ఏళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో అత్యుత్తమ సేవలు అందించినందుకు భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాన్ని మంగళవారం ప్రకటించింది. నర్సింహ 1997లో దక్షిణ మధ్య రైల్వేలో కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. 2003 నుంచి 2010 వరకు సికింద్రాబాద్ డివిజన్లో విధులు నిర్వహించి ఇన్స్పెక్టర్గా ఉద్యోగొన్నతి పొందారు. కాజీపేట, వరంగల్లో, క్రైం బ్రాంచిలో బాధ్యతలు నిర్వర్తించారు. దోపిడీ ముఠాలను పట్టుకుని వారి నుంచి రూ.1.35 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే రిజర్వేషన్ టికెట్ల మోసాలకు పాల్పడే 45 మందిని పట్టుకున్నారు. నార్కోటిక్ మత్తు పదార్థాల రవాణ చేసే ముఠాను పట్టుకున్నారు. ఇతని సేవలకు 2003లో రైల్వే శాఖ మంత్రి నుంచి, 2013లో రైల్వే డైరక్టర్ జనరల్ నుంచి, 2021లో జనరల్ మేనేజర్ నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తనకు ఉత్తమ సేవా పతకం ప్రకటించినందుకు నర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. తాను మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు