రహదారి ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ ఉన్నారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి.. విభాగిని మధ్యలో పడి
చౌటుప్పల్గ్రామీణం, న్యూస్టుడే: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వెల్పూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకట సతీశ్(28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి వెంకట సతీశ్ రావులపాలెంలోని అమ్మమ్మ ఇంటి నుంచి హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయానికి దండుమల్కాపురానికి చేరుకున్నారు. ఈ సమయంలో వెంకటసతీశ్ ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కిందపడి విభాగిని మధ్యలో పడి చనిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటసతీశ్ మృతదేహానికి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని సోదరుడు రవికృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై బి.సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
తిప్పర్తి: మండలంలోని అద్దంకి-నార్కట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన జేజాల వెంకట్రెడ్డి(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఉదయం నడుచుకుంటూ వెళుతుండగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్రెడ్డికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
సైకిల్పై వెళ్తుండగా...
సూర్యాపేట నేరవిభాగం: ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంలో సైకిల్పై వెళ్తున్న వృద్ధుడు మృతిచెందిన ఘటన సూర్యాపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డకు చెందిన పానుగంటి వెంకట నర్సింహారావు (59) మంగళవారం ఖమ్మం క్రాస్రోడ్డు నుంచి జమ్మిగడ్డ క్రాస్రోడ్డు వైపునకు సర్వీసు రహదారిపై సైకిల్పై వెళ్తున్నారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నర్సింహారావు సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
కారు ఢీకొని ...
చివ్వెంల: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందిన ఘటన వల్లభాపురం స్టేజీ వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లభాపురానికి చెందిన యాట వెంకటయ్య (65) స్టేజీ వద్ద రహదారి దాటుతుండగా విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారు అతివేగంగా ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇబ్రహీం తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి..
బండిగారి విక్రమ్
వలిగొండ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బండిగారి యాదగిరి, పద్మ దంపతుల పెద్ద కుమారుడు విక్రమ్ (22) రామన్నపేట ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. విక్రమ్ ట్రాక్టర్ ఇంజిన్తో వలిగొండ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం రామన్నపేట ప్రభుత్వసుపత్రికి తరలించినట్లు ఎస్సై రాఘవేందర్గౌడ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..