22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల పలకరింపు
22 ఏళ్ల క్రితం కన్నవాళ్లు, తోబుట్టుల నుంచి విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని
‘ఈనాడు’ కథనంతో తెలిసిన ఆచూకీ..
‘దుర్గ’ది పశ్చిమ గోదావరి జిల్ల్లాగా గుర్తింపు
దామరచర్ల, న్యూస్టుడే
దుర్గ బావ కొండయ్య, మేనత్త సౌదామణి
22 ఏళ్ల క్రితం కన్నవాళ్లు, తోబుట్టుల నుంచి విధి దూరం చేసినా.. ‘ఈనాడు’ కథనం కలిపింది. ఇంటి నుంచి తప్పిపోయిన దుర్గ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణేశ్వరంలోని దేవునితోట ఆవాస గ్రామంగా తేలింది. ‘విధిరాతతో విడిపోయి.. 22 ఏళ్లుగా కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూపులు’ శీర్షికన సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కథనంలో దుర్గ పేర్కొన్న కుటుంబ సభ్యుల పేర్లను గమనించిన లక్ష్మణేశ్వరంలోని ఫీల్డ్ అసిస్టెంట్ కొరివి దామోదరం.. దుర్గ మేనేత్త సౌదామణి, బావ కొండయ్యకు విషయం తెలిపారు. వారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం ఇండియా సిమెంట్సు కర్మాగారం కాలనీలో ఉంటున్న దుర్గకు మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. ‘హలో దుర్గా.. మాట్లాడుతున్నది మీ మేనత్త సౌదామణిని’ అనగానే దుర్గ నోటివెంట మాట రాలేదు. తాను వింటున్నది నిజమేనా.. అని ఆశ్చర్యపోయింది. వెంటనే తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల పేర్లు చెప్పగానే ‘అందరూ బాగానే ఉన్నారు. పెద్ద అక్క కువైట్లో ఉంటున్నారని, ఇద్దరు చెల్లెళ్లకు వివాహమైందని వారితోనూ మాట్లాడిస్తానని మేనేత్త తెలిపిందని’ దుర్గ వివరించారు. 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలువనున్న ఆనందంలో దుర్గ, ఆమె భర్త అశ్వినీకుమార్ ఉన్నారు.
ఫోన్లో మేనత్తతో మాట్లాడుతున్న దుర్గ
రైల్వేస్టేషన్ పక్కనే ఊరు
ముందు నుంచి దుర్గ చెప్పినట్లుగా ఆమె ఊరు నర్సాపురం రైల్వేస్టేషన్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్ష్మణేశ్వరానికి చెందిన దుర్గ ఆరేళ్ల వయస్సులో రైలు చూడాలనే కోరికతో స్టేషన్ వద్దకు వచ్చి రైలు ఎక్కింది. రైలు కదలగా అందులోనే నిద్రపోయి.. కాచిగూడలో దిగింది. రైల్వేపోలీసులు గుర్తించి స్థానిక పోలీసుల సహకారంలో క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో చేర్పించారు. ఊరు పేరు గుర్తులేక పోవడంతో తల్లిదండ్రులు త్రివేణి, ఆంజనేయులు, అక్కాచెల్లెళ్లు వెంకటలక్ష్మి, మంగ, లలిత, మేనేత్త సౌదామణి పేర్లను రాసుకొని గుర్తు ఉంచుకుంది. ఇటీవల దుర్గకు మిషనరీ వారు వివాహం జరిపించగా దామరచర్లలో ఉంటున్నారు. ఆమె గాథపై ‘ఈనాడు’ కథనం ప్రచురించడంతో బుధవారం కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారు. విషాదమేమిటంటే దుర్గ తల్లిదండ్రులు ఇటీవల కాలం చేసినట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని వారు ఫోన్లో దుర్గకు తెలియపర్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి