logo

అదృశ్యమైన వివాహిత మృతి

అదృశ్యమైన మహిళ కథ విషాదాంతంగా మారింది. భువనగిరి మండలం రాయిగిరి చెరువులో శవమై తేలింది. యాదగిరిగుట్ట ఎస్సై సైదులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నమాత్‌పల్లికి చెందిన

Published : 26 Jan 2022 04:40 IST

చుక్కల సంతోష

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: అదృశ్యమైన మహిళ కథ విషాదాంతంగా మారింది. భువనగిరి మండలం రాయిగిరి చెరువులో శవమై తేలింది. యాదగిరిగుట్ట ఎస్సై సైదులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నమాత్‌పల్లికి చెందిన పద్మ, వెంకటయ్య దంపతుల కూతురు చుక్కల సంతోష (27)కు, పట్టణంలోని యాదగిరిపల్లికి చెందిన సత్యనారాయణతో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆరేళ్ల లోపు కొడుకు, కూతురు ఉన్నారు. సత్యనారాయణ గోర్ల పెంపకదారుడు. పెళ్లయిన కొన్నాళ్ల నుంచి అదనపు కట్నం కోసం సంతోషను వేధింపులకు గురిచేసేవాడు. భర్తకు తోడు అత్త, ఆడబిడ్డల పోరు ఎక్కువైంది. దీనిపై అనేకమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ భర్త తీరులో మార్పు రాలేదు. వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 23 సాయంత్రం నుంచి కనిపించలేదు. వెతికినా ఎక్కడా ఆచూకి లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు యాదగిరిగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు. మంగళవారం భువనగిరి మండలం రాయగిరి చెరువులో మృతదేహం కనిపించింది. పోలీసులు దర్యాప్తులో మృతురాలు సంతోషగా గుర్తించారు. సంతోష బలవన్మరణానికి పాల్పడలేదని, భర్త, అత్త, ఆడబిడ్డలు కలిసి వేధింపులకు గురిచేసి, కొట్టి, హత్యచేసి చెరువులో పడేశారని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మహేశ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు