ప్రసవానికి ముందే పాప మృతి
ప్రసవానికి ముందే పాప మృతి చెందటానికి కారణం ఏరియా ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని మంగళవారం రాత్రి మృతి చెందిన పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు
హుజూర్నగర్: ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పాప బంధువులతో మాట్లాడుతున్న ఎస్సై వెంకటరెడ్డి
హుజూర్నగర్, న్యూస్టుడే: ప్రసవానికి ముందే పాప మృతి చెందటానికి కారణం ఏరియా ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని మంగళవారం రాత్రి మృతి చెందిన పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు చెందిన పిండిప్రోలు లక్ష్మణ్ భార్య శ్రావణి గర్భవతి. శ్రావణి తల్లిదండ్రులది హుజూర్నగర్ కావటంతో ఏరియా ఆసుపత్రిలోనే మొదటి నుంచి పరీక్షలు చేయించుకుంటుంది. ప్రసూతి సమయం రావటంతో శ్రావణి సోమవారం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నుంచి నొప్పులు బాగా వస్తున్నాయని శ్రావణి ఆసుపత్రికి సిబ్బందికి చెప్పింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమె ఆపరేషన్ అవసరం లేకుండా డెలివరీ అవుతుందని చెప్పి ఆమెను సముదాయించారు. సాయంత్రం వరకు నొప్పులు తీవ్రంగా ఉండటంతో తాము వేరే ఆసుపత్రికి పోతామని చెప్పి ఆసుపత్రి వారికి రాసిచ్చి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి పోయారు. అక్కడ డాక్టర్ ఆమెకు శస్త్రచికిత్స కాకుండా ప్రసవం చేసి మృతి చెందిన పాపను బయటకు తీశారు. పాప చనిపోయిందని చెప్పటంతో పాప బంధువులు ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ: శ్రావణికి మామూలు ప్రసూతి అయ్యే అవకాశం ఉండటంతో అందుకోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వారు తాము వేరే ప్రైవేటు ఆసుపత్రికి పోతామని చెప్పి రాసిచ్చి వెళ్లిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రి నుంచి వారు బయటకు పోయేటప్పుడు కూడా పరీక్షించామని పాప గుండె చక్కగా కొట్టుకుంటుందని తెలిపారు. వారికి నచ్చచెప్పినా వినకుండా పోవటం వల్ల పాప చనిపోయింది.. ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.