తెరాస జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రకుమార్
సుదీర్ఘకాలం తర్వాత అధికార తెరాస.. తమ పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సామాజిక సమీకరణాల నేపథ్యాలను అంచనా వేసి ఇప్పటికే పలు పదవుల్లో ఉన్నవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించారు. నల్గొండ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సూర్యాపేటకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరికి ఆయిల్ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని
ఈనాడు, నల్గొండ
సుదీర్ఘకాలం తర్వాత అధికార తెరాస.. తమ పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సామాజిక సమీకరణాల నేపథ్యాలను అంచనా వేసి ఇప్పటికే పలు పదవుల్లో ఉన్నవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించారు. నల్గొండ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సూర్యాపేటకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరికి ఆయిల్ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మూడు జిల్లాలకు అప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిని కాదని, అనూహ్యంగా ఇప్పటికే ప్రజా పదవుల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారిని ఎంపిక చేయడం గమనార్హం. 2016 తర్వాత జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించడం తెరాసకు ఇదే తొలిసారి. గతేడాది అక్టోబరులో గ్రామ, వార్డు, పట్టణ కమిటీలకు అధ్యక్షుల నియామకం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించాల్సి ఉన్నా దాదాపు మూడు నెలల విరామం అనంతరం అన్ని కోణాల్లో సమతూకం చేసి వీరిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అంచనాలకు అందకుండా
రానున్న ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎవరి అంచనాలకు అందకుండా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ పదవుల కోసం ఏళ్లుగా ఉద్యమంలో ఉండి, పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నవారు సైతం ప్రయత్నించగా.. అధిష్ఠానం ఎమ్మెల్యే, ఎంపీలనే అధ్యక్ష పదవులకు ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో క్యాడర్తో పాటూ వివిధ వర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసే దిశగా వీరు కృషిచేయాల్సి ఉంది. మూడు జిల్లాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సామాజికవర్గాలకు చెందిన వారినే అధ్యక్షులుగా ఎంపిక చేయడం రాజకీయ వ్యూహంలో భాగమేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మూడు సార్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ మండలం రత్యా తండాకు చెందిన రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తుతం దేవరకొండ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమ్యూనిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 2004, 2014ల్లో సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీపీఐ నుంచి రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. అనంతరం వివిధ పరిణామాల నేపథ్యంలో 2016లో ఆయన తెరాసలో చేరారు. 2018లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి గిరిజన సామాజికవర్గానికి చెందిన వ్యక్తే జిల్లా అధ్యక్షుడిగా ఉండగా...అధికార పార్టీ సైతం అదే సామాజిక వర్గానికే చెందిన రవీంద్రకుమార్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్