logo

హంతకుల జాడెక్కడా..!

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్‌ నాయక్‌ హత్య ఛేదించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌

Published : 27 Jan 2022 03:50 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్‌ నాయక్‌ హత్య ఛేదించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్‌ గ్రామానికి చెందిన జైహింద్‌ నాయక్‌(30) తల మొండెం వేరు చేసిన గుర్తు తెలియని దుండగులు చింతపల్లి మండలం మహంకాళి అమ్మవారి విగ్రహం వద్ద పెట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల తరవాత తుర్కయాంజల్‌లోని ఓ నాలుగంతస్తుల భవనంపై పోలీసులు మొండాన్ని గుర్తించారు. పోలీసులు నిందితులను నేటికీ గుర్తించలేకపోయారు. ఈ కేసు దర్యాప్తు మూడు జిల్లాల పరిధిలో ఉండటం కూడా కారణం. దీంతో హత్యకు పాల్పడిన నరహంతకుల జాడ కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీఎస్‌ పోలీసులతో పాటు దేవరకొండ, నాంపల్లి పోలీసులు హత్య జరిగిన భవనం యజమానులతో పాటు ఇతరులను పది మంది వరకు విచారణ చేసినా పురోగతి లేనట్లు తెలిసింది. చరవాణి డంపులు, సీసీ కెమెరాల పుటేజీ, పాత నేరస్తుల వివరాలు తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నా ఇంత వరకు ఆధారాలు దొరకలేదు. పక్కా పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతం జిల్లా పరిధిలో లేని కారణంగా ఇక్కడి పోలీసులకు స్థానికుల సహకారం లభించడం లేదు. దీంతో పాటు కొవిడ్‌ కారణంగా విచారణలో జాప్యం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని