కలెక్టరేట్లో కలకలం
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. కలెక్టరేట్లో జాతీయ జెండా ఎదుట ఓ రైతు తన సమస్య పరిష్కారానికి రెండో సారి ఆత్మహత్యకు యత్నించడం బుధవారం కలకలం రేపింది. కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై
రెండోసారి ఆత్మహత్యకు యత్నించిన రైతు
కలెక్టరేట్లో రైతు మహేశ్ను అడ్డుకుంటున్న పోలీసులు
భువనగిరి, న్యూస్టుడే: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. కలెక్టరేట్లో జాతీయ జెండా ఎదుట ఓ రైతు తన సమస్య పరిష్కారానికి రెండో సారి ఆత్మహత్యకు యత్నించడం బుధవారం కలకలం రేపింది. కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడేనికి చెందిన బుడిగె మహేశ్ తండ్రి ఉప్పలయ్య పేరిట ఆలేరు మండలం కొలనుపాక శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. ఇందులో నాలుగెకరాలు పాస్పుస్తకంలో నమోదు కాలేదు. ఇందుకు 2006 నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, అప్పటి ఆలేరు తహసీల్దార్ శ్యాంసుందర్ సర్వే చేసి కబ్జాలో ఉప్పలయ్యనే ఉన్నారని స్పష్టం చేశారని మహేశ్ తెలిపారు. ఆర్డీవో కోర్టులో ఉన్న ఈ కేసును ఇటీవలే కలెక్టర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్కు బదిలీ చేయగా అక్కడ కేసును కొట్టేశారని వెల్లడించారు. ఈ సమస్యపై మహేశ్ గత డిసెంబర్ 13న కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్లి పెట్రోల్ పొసుకున్నారు. గమనించిన సిబ్బంది తలుపులు పగులగొట్టి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత తహసీల్దార్, అదనపు కలెక్టర్ కలిసి ఉప్పలయ్య భూమి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు తమ సమస్య పరిష్కారం కాలేదని మహేశ్ బుధవారం మరోసారి ఆత్మహత్యకు యత్నించారు. కలెక్టరేట్లో గణతంత్ర వేడుకలు ముగిశాక కలెక్టర్ వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా వచ్చిన మహేశ్ సంచిలోంచి పెట్రోల్ డబ్బా తీసుకొని కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. తాము కొనుగోలు చేసిన భూమిని పాసుపుస్తకంలో నమోదు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం పోలీసులు మహేశ్ను ఠాణాకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు