సలహాలు పాటిస్తూ.. లాభాలు గడిస్తూ..
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ తగిన పంటలు సాగుచేసి నష్టాల స్థానంలో లాభాలు గడించవచ్చునని నిరూపిస్తున్నారు ఆత్మకూర్(ఎస్) మండలం నంద్యాలగూడెం, బోరింగ్తండావాసులు. ఈ రెండు గ్రామాలను జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ(క్రిడా)
ప్రకృతిని జయిస్తూ పంటలు పండిస్తున్న మహిళా రైతులు
ఆత్మకూర్(ఎస్), న్యూస్టుడే
బోరింగ్తండాలో ఆకుకూరల సాగులో గిరిజనులు
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ తగిన పంటలు సాగుచేసి నష్టాల స్థానంలో లాభాలు గడించవచ్చునని నిరూపిస్తున్నారు ఆత్మకూర్(ఎస్) మండలం నంద్యాలగూడెం, బోరింగ్తండావాసులు. ఈ రెండు గ్రామాలను జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ(క్రిడా) మూడేళ్ల క్రితం దత్తత తీసుకుంది. కరవు పరిస్థితుల్లో ప్రకృతిని ఎలా జయించాలో, ఏయే పంటలు వేసి ఆదాయం గడించాలో క్రిడాకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు రైతులకు శిక్షణ, సలహాలు అందించారు. ఉచితంగా వివిధ పంటల విత్తనాలు పంపిణీ చేశారు. పశువులకు టీకాలు వేయించడం, వ్యవసాయ పరికరాలు అద్దెకివ్వడం, చెక్డ్యాంలు, పంట కుంటల నిర్మాణం, చేపలు, కోళ్ల పెంపకం, బెట్ట పరిస్థితులను ఎదుర్కోవటం తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఫలితంగా ఈ రెండు గ్రామాల రైతులతోపాటు మహిళా రైతులు వ్యవసాయ రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు.
కూరగాయల పెంపకంతో రోజువారీ ఆదాయం
-గుగులోత్ మంగ్తీ, బోరింగ్తండా
మాకున్న ఐదెకరాల భూమిలో రెండు ఎకరాలు వరి, రెండు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో కూరగాయల పంటలు సాగు చేస్తాం. కూరగాయల సాగు ఏడాది పొడవునా ఉంటుంది. ఈ పంటపై వచ్చే ఆదాయం ఇతర పంటలకు పెట్టుబడులుగా, ఇంట్లో అవసరాలకు ఉపయోగపడుతుంది. మాకు అధికారులు, శాస్త్రవేత్తలు కంది, పెసర, తదితర మెట్ట పంటల విత్తనాలు పంపిణీ చేశారు. పశువులకు టీకాలు వేశారు. ఎప్పుడు ఏ పంట వేయాలో మెలకువలు నేర్పారు.
కరవులోనూ బావుల్లో నీళ్లు దొరుకుతున్నాయి
-గుగులోత్ ఝాన్సీ, బోరింగ్తండా
శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వచ్చి మా తండాలో పెద్ద చెక్డ్యాం తవ్వించారు. వర్షాకాలంలో చెక్డ్యాం నిండితే మా బావుల్లో నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి. అంతకుముందు బావులు ఎండిపోయేవి. ఇప్పుడు సాగునీరు ఉండడంతో వివిధ రకాల పంటలు సాగు చేయగల్గుతున్నాం. ముఖ్యంగా ఐదుగుంటల విస్తీర్ణంలో కూరగాయల సాగుతో రోజుకు ఆదాయం రూ.1,000 వరకు వస్తుంది.
శాస్త్రవేత్తలు మెలకువలు నేర్పారు
-బీసు మైబూబ, నంద్యాలగూడెం
మల్బరీ సాగును ఐదేళ్లకుపైగా చేపట్టి పట్టుగూళ్లతో ఆదాయం గడించాం. రెండేళ్లుగా కూరగాయలు పండిస్తున్నాం. టమాట, బెండ, వంగ, ఇతర తీగజాతి, ఆకుకూరలు సాగుచేస్తున్నాం. దిగుబడిని సూర్యాపేట మార్కెట్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాం. నంద్యాలగూడెం కేంద్రంగా నిక్రా శాస్త్రవేత్తలు సాగులో నేర్పిన మెలకువలు అధిక దిగుబడులకు ఉపకరిస్తున్నాయి.
మల్బరీ సాగుతో అధికాదాయం
-నంద్యాల స్వప్న, నంద్యాలగూడెం
ఎనిమిదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నాం. అధికారులు నేర్పిన మెలకువలు, సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరి, పత్తి కంటే మల్బరీ సాగు లాభదాయకమైంది. మూడెకరాల్లో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి సుమారు ఎనిమిది పంటలు తీసి సరాసరి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు