క్రయవిక్రయాలకు బారులు
ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇటీవల క్రయ విక్రయదారుల సందడి బాగా పెరిగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయ భూములు 50 శాతం, ఓపెన్ ప్లాట్లు 35 శాతం, బహుళ అంతస్తులు 25 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన రిజిస్ట్రేషన్లు
బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ప్లాట్ల క్రయ, విక్రయదారుల సందడి
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇటీవల క్రయ విక్రయదారుల సందడి బాగా పెరిగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి వ్యవసాయ భూములు 50 శాతం, ఓపెన్ ప్లాట్లు 35 శాతం, బహుళ అంతస్తులు 25 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు జిల్లాలకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వం మరోసారి మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు సమాచారం రావడంతో కొనుగోలు దారులు పాత ధరల్లో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గడిచిన ఏడాదిలో ప్రభుత్వం రెండు సార్లు ధరలు పెంచడంపై పేద, మధ్య తరగతి వారు భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందని కొనుగోలుదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పదిహేను సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం పదింటిలో సర్వర్లు పనిచేయని కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో బాధితులు గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.అతి తక్కువగా మోత్కూరు 166, రామన్నపేట 182, చండూరు 236, రిజిస్ట్రేషన్లు అయ్యాయి. పెంచిన ధరలు అమల్లోకి రావడానికి మరో మూడ్రోజులు ఉన్నందున రిజిస్ట్రేషన్ల కోసం క్రయ విక్రయదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
సాధారణ రోజుల కన్నా ఎక్కువగా..
బీబీనగర్: బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూములు, ప్లాట్ల విలువల పెంచేందుకు ప్రభుత్వం చర్చిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ప్లాట్ల క్రయ, విక్రేతల సందడి కనిపించింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మరింత గడువున్నప్పటికీ కొనుగోలుదారులు భూముల విలువ పెరుగుతోందని ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. బీబీనగర్లో సాధారణంగా రోజుకు 30 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. గురువారం ఒక్క రోజే 90 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని సబ్ రిజిస్ట్రార్ సతీష్ తెలిపారు.
భువనగిరి టౌన్: భువనగిరిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగే.. ఇందుకు భిన్నంగా ఈ నెల 25న 45 డాక్యుమెంట్లు, గురువారం రికార్డు స్థాయిలో 115 డాక్యుమెంటు రిజిస్టర్ అయ్యాయి. గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్రయ విక్రేతలు భారీగా తరలి రావడంతో కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
- ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
ప్రతి సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మార్కెట్ విలువలు పెరుగుతాయనే సమాచారముంది. కానీ ఏ ప్రాంతంలో ఎంత పెరుగుతుందనేది జిల్లాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM