జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు షురూ
మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్పహాడ్ దర్గా ఉర్సు వేడుకలు గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు
పాలకవీడు గ్రామీణం, న్యూస్టుడే
విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులీనుతున్న దర్గా
మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన జాన్పహాడ్ దర్గా ఉర్సు వేడుకలు గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు తెల్లవారుజామున గుసూల్ ఉర్సే షరీఫ్ ఆరంభమైనట్లు మత పెద్దలు తెలిపారు. దర్గా ముజావరు సయ్యద్ జానీ దర్గాలోని హజ్రత్ సయ్యద్ మొహినుద్ధీన్ జాన్పాక్ షహీద్ రహమతుల్లా అల్తె, సోదరుడి సమాధులపైనున్న పాత ఛాదర్లు, దట్టీలను తొలగించి సమాధులను నీటితో శుభ్రం చేయించారు. అనంతరం నూతన ఛాదర్లు, దట్టీలను గ్రామంలో ఊరేగింపు నిర్వహించి సైదన్న సమాధులను పూలు, గంధంతో యువరాజులా అలంకరించారు. గంధం సమాధులపైకి ఎక్కించే కార్యక్రమంలో ఫకీర్ల గానాలాపనలు హోరెత్తించాయి. మత పెద్దల సైదులు బాబా నామస్మరణల మధ్య గంధం ఎక్కించే కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. అనంతరం జల్సా ఈ సిరత్ అల్లా నమాజ్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తదుపరి పాత ఛాదర్లు, దట్టీలను ఫకీర్ల ఖవ్వాళి గానాలాపనల మధ్య షపా బావి (పురాతన బావి)లో నిమజ్జనం చేశారు. దర్గా పరిసరాల్లో కొలువైన అమరుల సమాధులను సైతం అలంకరించారు. ఉదయం 7 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై కందూరు నిర్వహించి ఫాతేహాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. అన్నదాతలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పండిన కందులు, మినుములు, సజ్జలు, పెసర్లు, వరి ధాన్యంలొ కొంతభాగాన్ని సైదన్న స్వామికి సమర్పించి తమ పాడి పంటలను కాపాడాలని కోరుకొన్నారు.
భక్తుల వాహనాల నిలుపుదల ప్రదేశాలను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్
ప్రత్యేక ప్రార్థనలు
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వక్ఫ్బోర్డు కార్యాలయం నుంచి తెప్పించిన ప్రత్యేక పరిమళ గంధాన్ని కొద్దిమంది మత పెద్దల సమక్షంలో హజ్రత్ సయ్యద్ మొహినుద్ధీన్ జాన్పాక్ షహీద్ రహమతుల్లా అల్తె సమాధులకు ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
నేడు గంధం ఊరేగింపు
ఉత్సవాల్లో కీలకమైన పవిత్ర గంధోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య కనులపండువగా జరగనుంది. స్థానిక చందనఖానాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల సమక్షంలో మత పెద్దలు, వక్ఫ్బోర్డు అధికారులు ప్రత్యేక ఈద్ ఉల్ జుమా నమాజ్ నిర్వహించి పూర్వ జాన్పహాడ్ గ్రామ వీధుల్లో గుర్రాలపై ఊరేగింపు నిర్వహించి సాయంత్రం 4గంటల నమయంలో సైదులు బాబా సమాధులపైకి ఎక్కిస్తారు. ఈ సందర్భంగా తెరాస జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పవిత్ర గంధోత్సవానికి హాజరుకానున్నట్లు దర్గా వర్గాలు తెలిపారు.
పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేంద్రప్రసాద్
దర్గా ఉర్సు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ గురువారం తెలిపారు. ఆయన దర్గా పరిసరాలను పరిశీలించి మాట్లాడారు, 250 మంది సిబ్బంది, 22 మంది ఎస్సైలు, 4గురు సీఐలు, 50 మంది రోప్ పార్టీ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కోన్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సైదన్న స్వామి దర్శనం చేసుకొవాలని, 16 నిఘా నేత్రాల మధ్య పర్యవేక్షణ ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM