అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తాం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మొత్తం ఆరు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెరాస జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ వెల్లడించారు. తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..
తెరాస జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
ఈనాడు, నల్గొండ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మొత్తం ఆరు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెరాస జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ వెల్లడించారు. తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..
అసంతృప్తులతో మాట్లాడుతా.. నేతలను సమన్వయం చేస్తా
సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలందరినీ సమన్వయం చేస్తాం. అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీకి బలంగా మారేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే సంస్థాగత పదవుల భర్తీ పూర్తయింది. అత్యధిక పదవుల్లో తెరాస నేతలే ఉన్నారు. వారిని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరింత భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పని అయిపోయింది. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన నాయకులు సైతం మా ప్రభుత్వ విధానాలు నచ్చి తెరాసలో చేరుతారన్న నమ్మకం ఉంది. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా గత ఏడేళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తాం. గత ప్రభుత్వాలు నల్గొండ జిల్లాకు చేసిన అభివృద్ధి, మా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెరాసకు ధీటుగా ఉన్న రాజకీయపార్టీ లేదు. వచ్చే పదేళ్ల పాటూ ఏ ఎన్నికలు జరిగినా గెలుపు తెరాసదే.
ప్రభుత్వ కార్యక్రమాలనూ ప్రజలకు వివరిస్తాం
నల్గొండ జిల్లా లాంటి ప్రాధాన్యం ఉన్న జిల్లాకు అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉంది. గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనుభవం ఇక్కడ కలిసొచ్చింది. సంస్థాగత నిర్మాణం నాకేమి కొత్త కాదు. ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఐదింటిలో మేమే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులోనూ పార్టీ జెండా ఎగరేస్తాం. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న పార్టీ తెరాసనే. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అవి అన్ని పార్టీల్లోనూ సహజమే. వాటన్నింటినీ చక్కదిద్ది పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా చేర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. త్వరలోనే రెండు మూడు రోజుల్లో దీనిపై పార్టీ మాకు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం మేం ముందుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు