logo

పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తాం

రానున్న ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ తిరిగి గులాబీ జెండా ఎగురేస్తామని....ఆ దిశగానే పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తామని తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. ఈ సందర్భంగా

Published : 28 Jan 2022 03:45 IST

తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌

రానున్న ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ తిరిగి గులాబీ జెండా ఎగురేస్తామని....ఆ దిశగానే పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తామని తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..

-ఈనాడు, నల్గొండ

లోటుపాట్లను చక్కదిద్దుతాం..

గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, సంస్థాగత నిర్మాణంలో అవలంభించిన చర్యలు, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రోత్సాహంతో సీఎం కేసీఆర్‌ నన్ను ఈ పదవీకి ఎంపిక చేశారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. సూర్యాపేటను మంత్రి జగదీశ్‌రెడ్డి గతంలో ఎన్నడూ జరగని విధంగా రూ. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇదే అభివృద్ధిని మరో రెండేళ్ల పాటు కొనసాగించి ప్రజలను ఓట్లు అడుగుతాం. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న పార్టీ తెరాసనే. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అన్నింటినీ చక్కదిద్దుతాం. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా చేర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. త్వరలోనే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో వీటిపై చర్చించనున్నాం.
నేతలను సమన్వయం చేస్తా..
నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలందరినీ సమన్వయం చేస్తాం. అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీకి మరింత బలంగా మారేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సంస్థాగత పదవుల భర్తీ పూర్తయింది. అత్యధిక పదవుల్లో తెరాస నేతలే ఉన్నారు. వారిని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరింత భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే పదేళ్ల పాటు ఎన్నికలు ఏవి జరిగినా తెరాసనే విజయం సాధిస్తుంది.
సంక్షేమం.. అభివృద్ధి నినాదంతో ...
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పని అయిపోయింది. కాంగ్రెస్‌ రోజురోజకూ బలహీనపడుతోంది. ప్రజలకు ఈ ఏడేళ్లలో చేసిందేమిటో చెప్పడానికి భాజపా వద్ద సమాధానం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ వివిధ పార్టీల్లో మిగిలిపోయిన నాయకులు సైతం మా ప్రభుత్వ విధానాలు నచ్చి త్వరలోనే తెరాసలో చేరుతారన్న నమ్మకం ఉంది. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా గత ఏడేళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తాం. సూర్యాపేటను కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పరిచి, వైద్యళాశాలను తీసుకొచ్చాం. మా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెరాసకు ధీటుగా ఉన్న రాజకీయ పార్టీ లేదు. వచ్చే పదేళ్ల పాటూ ఏ ఎన్నికలు జరిగినా గెలుపు తెరాసదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని