పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తాం
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ తిరిగి గులాబీ జెండా ఎగురేస్తామని....ఆ దిశగానే పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తామని తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా
తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్
రానున్న ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ తిరిగి గులాబీ జెండా ఎగురేస్తామని....ఆ దిశగానే పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తామని తెరాస జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆయన మాటల్లోనే..
-ఈనాడు, నల్గొండ
లోటుపాట్లను చక్కదిద్దుతాం..
గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, సంస్థాగత నిర్మాణంలో అవలంభించిన చర్యలు, మంత్రి జగదీశ్రెడ్డి ప్రోత్సాహంతో సీఎం కేసీఆర్ నన్ను ఈ పదవీకి ఎంపిక చేశారు. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. సూర్యాపేటను మంత్రి జగదీశ్రెడ్డి గతంలో ఎన్నడూ జరగని విధంగా రూ. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇదే అభివృద్ధిని మరో రెండేళ్ల పాటు కొనసాగించి ప్రజలను ఓట్లు అడుగుతాం. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న పార్టీ తెరాసనే. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు. అన్నింటినీ చక్కదిద్దుతాం. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా చేర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తాం. త్వరలోనే రెండు మూడు రోజుల్లో హైదరాబాద్లో జరిగే సమావేశంలో వీటిపై చర్చించనున్నాం.
నేతలను సమన్వయం చేస్తా..
నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలందరినీ సమన్వయం చేస్తాం. అసంతృప్త నేతలతో మాట్లాడి వారు పార్టీకి మరింత బలంగా మారేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సంస్థాగత పదవుల భర్తీ పూర్తయింది. అత్యధిక పదవుల్లో తెరాస నేతలే ఉన్నారు. వారిని ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మరింత భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే పదేళ్ల పాటు ఎన్నికలు ఏవి జరిగినా తెరాసనే విజయం సాధిస్తుంది.
సంక్షేమం.. అభివృద్ధి నినాదంతో ...
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పని అయిపోయింది. కాంగ్రెస్ రోజురోజకూ బలహీనపడుతోంది. ప్రజలకు ఈ ఏడేళ్లలో చేసిందేమిటో చెప్పడానికి భాజపా వద్ద సమాధానం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ వివిధ పార్టీల్లో మిగిలిపోయిన నాయకులు సైతం మా ప్రభుత్వ విధానాలు నచ్చి త్వరలోనే తెరాసలో చేరుతారన్న నమ్మకం ఉంది. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా గత ఏడేళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజల్లోకి వెళుతోంది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందుతున్న లబ్ధిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తాం. సూర్యాపేటను కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పరిచి, వైద్యళాశాలను తీసుకొచ్చాం. మా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెరాసకు ధీటుగా ఉన్న రాజకీయ పార్టీ లేదు. వచ్చే పదేళ్ల పాటూ ఏ ఎన్నికలు జరిగినా గెలుపు తెరాసదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠా అరెస్టు
[ 20-04-2024]
జిల్లాలో వరుసగా గొలుసు దొంగతనాలకు, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. -
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆలేరు నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?