హక్కులు కాపాడటంలో చిత్తశుద్ధితో పని చేయాలి
ప్రజల హక్కులను కాపాడటంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. భువనగిరిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ
భువనగిరిలోని జిల్లా ఆసుపత్రిలో పర్యవేక్షణాధికారి చిన్న నాయక్తో సౌకర్యాల గురించి
మాట్లాడుతున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య
భువనగిరి గ్రామీణం: ప్రజల హక్కులను కాపాడటంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. భువనగిరిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల హక్కులు ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొనే అధికారం తమ శాఖకు ఉందని చెప్పారు. కాన్పు కోసం వచ్చిన గర్భిణులకు వైద్యులు సరైన అవగాహన కల్పించక పోవడం వల్ల 90శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు.ఆబ్కారీ శాఖకు సంబంధించి పది కేసుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యాశాఖ అధికారులతో మన ఊరు-మనబడి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. మున్సిపాలిటీలలో చెత సేకరణ, పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై, దళిత బంధు పథకంపై, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖల పనితీరుపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాల మర్రిలో జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. జైలు వద్ద నల్గొండ సబ్ జైలు అధికారి విజయ డాని, భువనగిరి సబ్ జైలు పర్యవేక్షణాధికారి పూర్ణచందర్, పీడీఎం అనిల్కుమార్ స్వాగతం పల్లికారు. జైలు ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రాసుపత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. సౌకర్యాలపై ఆరా తీశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బస్వాపురం నిర్వాసితులు పరిహారం చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగేశ్వర్రావు, డీసీపీ నారాయణరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?