కొండెక్కిన కోడి
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చికెన్ ధర దడ పుట్టిస్తోంది. మధ్య తరగతి వారికి చికెన్ కొనలేని దుస్థితి నెలకొంది. రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కడంతో వాటికి దూరంగా ఉంటున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న చికెన్ ధరలు
భానుపురి, న్యూస్టుడే: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చికెన్ ధర దడ పుట్టిస్తోంది. మధ్య తరగతి వారికి చికెన్ కొనలేని దుస్థితి నెలకొంది. రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కడంతో వాటికి దూరంగా ఉంటున్నారు. వారం రోజుల్లోనే కిలోకు 60-80 పెరగడంతో వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చికెన్ ధర కిలో స్కిన్తో 284, స్కిన్లెస్ రూ.300కు విక్రయిస్తున్నారు. గత పదిరోజుల క్రితం వీటి ధర 200-224గా ఉంది. కోడి ధర కిలో రూ.124 నుంచి 150కు పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఒక రోజు 15 టన్నులు, ఆదివారం, పండగ రోజుల్లో 40 టన్నుల వరకు చికెన్ అమ్మకాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చేపలకు డిమాండ్.. చికెన్ ధర పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లాలో చేపలకు గిరాకీ పెరిగింది. వేసవిలో చెరువుల్లో నీరు అడుగంటడంతో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్ల వెంట విక్రయదారులే కనిపిస్తున్నారు. చెరువుల వద్ద కాకుండా వ్యాపారులు కిలో రూ.150కి విక్రయిస్తున్నారు. కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో విక్రయానికి తెచ్చిన చేపలు
వారంలోనే ధరలు పెరిగాయి
- వంశీ, చికెన్ సెంటర్ నిర్వాహకుడు, సూర్యాపేట
వారంలోనే అమాంతంగా ధరలు పెరగగా, మరోవైపు ఎండలు కూడా పెరిగాయి. ప్రస్తుతం డిమాండ్కు తగిన విధంగా సరఫరా లేదు. జిల్లాకు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి 60 శాతం, తెలంగాణ నుంచి 40 శాతం కోళ్లు తెప్పిస్తుంటాం. రవాణా ఛార్జీలు పెరగడం, కోళ్లు నిల్వలు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం దృష్టి సారించాలి
- అరుణ్, ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, సూర్యాపేట
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తాం. రోజుకు 25 కిలో చికెన్ తెప్పిస్తాం. ప్రస్తుతం స్కిన్ లెస్ కిలో రూ.300 ఉంటే మాకు 25 వరకు తగ్గించి ఇస్తున్నారు. గతంలో రూ.220 వరకు లభించే మాంసం ఇప్పుడు 80కి పైగా అదనంగా పెరిగింది. దీంతో వ్యాపారులకు లాభాలు తగ్గాయి. ప్రభుత్వం ధరల స్థిరీకరణఫై దృష్టిసారిస్తే మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.