అరచేతిలో వివరాలు ప్రత్యక్షం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలకు కేటాయించే నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా మంజూరు చేసే పద్దుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ-గ్రామ స్వరాజ్ అనే యాప్ దోహదపడుతోంది. ఈ యాప్
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెలకు కేటాయించే నిధులు, ఆర్థిక సంఘాల ద్వారా మంజూరు చేసే పద్దుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ-గ్రామ స్వరాజ్ అనే యాప్ దోహదపడుతోంది. ఈ యాప్ ద్వారా వ్యయాలకు సంబంధించినవి సైతం కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో ఏ సమాచారం కావాలన్నా స.హ.చట్టం ద్వారా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం 2019లో అందుబాటులోకి తీసుకురాగా.. తాజా వివరాలేవీ లభించేవి కాదు. తాజాగా యాప్ను అభివృద్ధి చేసి అన్ని వివరాలు పొందుపరిచారు.
పద్దు వివరాలు తెలుసుకునేలా..
ఆధునిక సమాజంలో స్మార్ట్ఫోన్ ప్రాధాన్యం అంతాఇంతా కాదు. విద్య, సామాజిక, రాజకీయ తదితర అంశాలను అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం సైతం వివిధ రకాల సేవలను ఫోన్ ద్వారా అందిస్తూ సేవలను చేరువ చేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకునే అవకాశం దక్కింది. పాలనలో పారదర్శకంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామాల పద్దు వివరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకునే సౌలభ్యం కలిగింది.
పనుల సమాచారం అందుబాటులో..
యాప్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు, పంచాయతీ నిర్వహణ, అభివృద్ధి పనులు, వాటి ఖర్చులు, తదితర వివరాలు తెలుసుకోవచ్ఛు అన్ని భాషల్లోనూ సమాచారం లభ్యమవుతుంది. ఆర్థిక పురోగతి, ఆస్తుల నిర్వహణ, జియో ట్యాగింగ్ వంటి వివరాలను సైతం పొందుపరిచారు. ప్రజా ప్రతినిధుల కమిటీలు, సర్పంచి, గ్రామ కార్యదర్శుల వివరాలు, నిధుల మంజూరు, వ్యయం, పనుల పురోగతి వంటివి సైతం కనిపిస్తాయి. వచ్చే ఏడాదికి సంబంధించిన అంచనాలు సైతం చూడొచ్ఛు
డౌన్లోడ్ ఇలా..
స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్లో ఈ-గ్రామ్ స్వరాజ్ అని టైప్ చేయగానే యాప్కు సంబంధించిన ఐకాన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని తెరిచి రాష్ట్ర, జిల్లా, మండలం, గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఆ గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల వివరాలు, పంచాయతీలో ఆమోదించిన కార్యకలాపాలు, ఆర్థిక పురోగతి వివరాలకు సంబంధించినవి ప్రత్యక్షమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?