Janasena: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.
చౌటుప్పల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. కొంగర సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. జనసేన కార్యకర్తల బీమా పథకం ద్వారా సైదులు భార్యకు రూ.5 లక్షల చెక్కును పవన్ అందించారు. అనంతరం కోదాడలోని శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.
పవన్ అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకుపైగా ఓట్లున్నాయి. అయితే వాటితో గెలవలేం. కానీ.. కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని మాత్రం చెప్పగలను. తెలంగాణ రాజకీయాలను జనసేన శాసిస్తుంది. తెలంగాణలో జనసేన బలోపేతానికి పనిచేస్తాం. రాజకీయాల్లో దెబ్బతిన్న వాడిని కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన బలాలు.. బలహీనతలు నాకు బాగా తెలుసు. తెలంగాణలో ప్రతి జిల్లాలో.. ప్రతి గ్రామంలో జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రతి చోటా మాకు అభిమానుల అండ ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలతో చర్చించి తీసుకుంటాం. తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నారు. ఆశయం కోసం నిలబడేవాడికి ఎప్పటికీ ఓటమి ఉండదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM