నల్గొండ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి: పవన్ కల్యాణ్
ఉద్యమ గడ్డ నల్గొండ జిల్లా ఇచ్చిన స్ఫూర్తితోనే 2008లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం చౌటుప్పల్, కోదాడలో ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో నల్గొండ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఫ్లోరోసిస్ సమస్య పరిష్కరించాలని అనుకున్నానని.. అప్పుడు స్థానిక రాజకీయాలతో కొందరు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మంచి పనులు చేయాలంటే...
కోదాడ: మృతుడి తల్లి కడియం లక్ష్మమ్మకు బీమా చెక్కు అందజేస్తున్న పవన్ కల్యాణ్
కోదాడ, కోదాడ పట్టణం, చౌటుప్పల్ గ్రామీణం- న్యూస్టుడే: ఉద్యమ గడ్డ నల్గొండ జిల్లా ఇచ్చిన స్ఫూర్తితోనే 2008లో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం చౌటుప్పల్, కోదాడలో ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో నల్గొండ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఫ్లోరోసిస్ సమస్య పరిష్కరించాలని అనుకున్నానని.. అప్పుడు స్థానిక రాజకీయాలతో కొందరు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మంచి పనులు చేయాలంటే స్వచ్ఛంద సంస్థ సరిపోదని రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అనిపించిందని చెప్పారు. తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.
బీమా చెక్కుల అందజేత...
హుజూర్నగర్ మండలం మర్రిగూడకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త కడియం శ్రీనివాస్ గతేడాది ఆగస్టు 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పార్టీ అందించిన ప్రమాద బీమా ద్వారా రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో నివసిస్తున్నారు. బీమా చెక్కు ను అందించేందుకు ఆయన శుక్రవారం కోదాడకు వచ్చారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబ సభ్యులను చౌటుప్పల్ మండలం లక్కారంలో పవన్కల్యాణ్ పరామర్శించారు. సైదులు భార్య సుమతికి బీమా చెక్కు అందజేశారు. పవన్కల్యాణ్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతీయ రహదారి నుంచి కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. అభిమానులు క్రేన్ సాయంతో గజమాలతో స్వాగతం పలికారు. తొలుత బాధిత కుటుంబాన్ని నేరుగా కలిసి చెక్కు అందించాలని భావించినా జనం అధికంగా ఉండటంతో ఆయన వాహనం దిగడం మంచిది కాదని పోలీసులు చెప్పటంతో బాధిత కుటుంబానికి ఆయన వద్దకే తీసుకువచ్చారు. మృతుడి తల్లి కడియం లక్ష్మమ్మ, కుటుంబ సభ్యులకు కారు వద్దనే చెక్కును అందజేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎక్కువ సమయం బాధిత కుటుంబంతో మాట్లాడే వీలులేకపోయింది. పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మేకల సతీశ్రెడ్డి, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సురేశ్, సైదులు పాల్గొన్నారు.
జనసంద్రంగా కోదాడ రంగా థియేటర్ సెంటర్
స్వల్ప అపశ్రుతి...
పవన్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని కొమరబండ సమీపంలోకి పవన్ కాన్వాయ్ ప్రవేశిస్తుండగా ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడి రహదారిపైకి వచ్చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కొంతమంది కింద పడిపోగా ఆయన కాన్వాయ్లోని ఓ వాహనం వారిపై నుంచి వెళ్లింది. మరి కొందరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. మండలంలోని కూచిపుడి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్ అనే అభిమాని నడుము మీద నుంచి కారు వెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడిని మొదటగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన చెన్నకేశవరావు, మరో మహిళ సైతం గాయపడ్డారు. అభిమానులను కంట్రోల్ చేసే క్రమంలో కోదాడ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. దేవరకొండకు చెందిన అభిమానికి కూడా గాయాలైనట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు