ఉద్యానం..అధ్వానం
పట్టణాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్నాయి. పార్కుల నిర్వహణ అధ్వానంగా తయారవడంతో ప్రజలకు ఆహ్లాదం కరవవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో 350కిపైగా పార్కు స్థలాలున్నాయి. అందులో అమృత్ పట్టణాలైన నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో కాస్త పార్కుల సుందరీకణ పనులు చేపట్టారు. కానీ వాటి నిర్వహణ సక్రమంగా లేదు. ఇక కొత్త పురపాలికల్లో పార్కులను అభివృద్ధి చేయడంలో పాలకవర్గాలు, పుర
నిరాదరణకు గురైన చౌటుప్పల్లోని పైలాన్ పార్కు
పట్టణాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్నాయి. పార్కుల నిర్వహణ అధ్వానంగా తయారవడంతో ప్రజలకు ఆహ్లాదం కరవవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో 350కిపైగా పార్కు స్థలాలున్నాయి. అందులో అమృత్ పట్టణాలైన నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేటల్లో కాస్త పార్కుల సుందరీకణ పనులు చేపట్టారు. కానీ వాటి నిర్వహణ సక్రమంగా లేదు. ఇక కొత్త పురపాలికల్లో పార్కులను అభివృద్ధి చేయడంలో పాలకవర్గాలు, పుర అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలు సేద తీరేందుకు వారాంతంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఒక్క నల్గొండ పట్టణంలో మాత్రమే కొత్తగా పార్కులు సుందరీకరిస్తున్నారు. చండూరులో కొత్తగా మూడు పార్కులను అభివృద్ధి పర్చినా ప్రారంభించడం లేదు. సూర్యాపేట పట్టణంలో ఉద్యానాలు అధ్వానంగానే ఉన్నాయి.
ఆలేరు: యాదగిరిగుట్టలో పార్కుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా ఏర్పాటుకు ఇంకా ముందడుగు పడలేదు. కొత్తగా ఏర్పడిన మోత్కూర్, హాలియా, తిరుమలగిరి, ఆలేరు, భూదాన్పోచంపల్లిలో ఏర్పాటు కాలేదు. నేరేడుచర్లలో పార్కు పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
చౌటుప్పల్: చౌటుప్పల్ పురపాలిక కేంద్రంలోని గాంధీ పార్కు పేరుకే పరిమితమైంది. దాని స్థలం కబ్జాకు గురైంది. పార్కులో పచ్చదనం మచ్చుకైనా లేదు. వాహనాల పార్కింగ్ స్థలంగా మారింది.
* మిషన్ భగీరథ పైలాన్ చుట్టూ పార్కు 2015లో ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపంతో తాళం పడింది.
నీలగిరిలో సాగుతున్న పనులు
నల్గొండ: సుందరీకరణలో రాంనగర్ పార్కు
నల్గొండ పురపాలిక: నల్గొండ పట్టణ ప్రజలకు ఆహ్లాదం అందించేలా పుర యంత్రాంగం పలు పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పట్టణ సుందరీకరణలో భాగంగా మూడు పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అమృత్ పథకం ద్వారా రాంనగర్, రాజీవ్ పార్కుతోపాటు మరో ఏడు పార్కుల్లో సుందరీకరణ పనులు చేపట్టారు. వాటికి తోడు పట్టణ ప్రగతి నిధుల ద్వారా చర్లపల్లిలో అర్బన్ పార్కును కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. నీలగిరి నడిబొడ్డున ఉన్న రాజీవ్పార్కు కొత్త కళ సంతరించుకొంది. అమృత్ పథకం ద్వారా రూ.75 లక్షలు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా రూ.50 లక్షలతో సుందరీకణ పనులు కొనసాగుతున్నాయి. రాంనగర్ పార్కులో సుమారు రూ.1.5 కోట్లతో ఫౌంటెన్, బోటింగ్ వంటి సౌకర్యాలతో సందర్శకులను ఆకర్షించేలా పనులు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఓపెన్ జిమ్లు, ఆట పరికరాలు సమకూర్చారు. ఇప్పటికే రాంనగర్ పార్కుకు నిత్యం 200కు పైగా సందర్శకులు వస్తున్నారు. సందర్శన రుసుం పేరుతో మున్సిపాలిటీకి సైతం ఆదాయం లభిస్తోంది. పార్కుల సుందరీకరణ పూర్తయితే సందర్శకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.
సౌకర్యాలు కరవు
సూర్యాపేటలో ప్రహరీకి నోచుకోని రాజీవ్గాంధీ పార్కు
సూర్యాపేట పురపాలిక: జిల్లా కేంద్రంలో పార్కుల నిర్వహణ అధ్వానంగా మారింది. కనీస సౌకర్యాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు లేవు. చిన్నారులు ఆడుకొనేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేయలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 పార్కులు ఉన్నాయి. ఇందిరా పార్కులో మరుగుదొడ్లు ఉన్నా వాటికి తాళం వేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్నగర్లోని పార్కులో ఎలాంటి మొక్కలు పెంచలేదు. రాజీవ్ గాంధీ పార్కు ప్రహరీ లేక అధ్వానంగా మారింది. చెత్తాచెదారంతో నిండిపోయింది. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. పార్కుల్లో వసతులు కల్పించాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మిన్నకుండిపోతున్నారు.
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ పురపాలికలో ఉన్న ఆరు పార్కులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉపయోగపడటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా