వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ
ముస్లింల ప్రార్థన మందిరాలు, దర్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన వేలాది ఎకరాల భూములను ముజావర్లు, ముతవలీలుగా చెలామణి అవుతూ అక్రమ మార్గంలో కాజేసిన విషయమై ‘ఈనాడు’ కొంత కాలంగా ఇస్తున్న
ఆక్రమణదారులంతా ఏకం..
బయట పడేందుకు యత్నాలు
‘ఈనాడు’ వరుస కథనాలకు స్పందన
నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాబ్ దర్గా భూములు పరిశీలిస్తున్న సీబీసీఐడీ అధికారులు బృందం
నీలగిరి, న్యూస్టుడే: ముస్లింల ప్రార్థన మందిరాలు, దర్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన వేలాది ఎకరాల భూములను ముజావర్లు, ముతవలీలుగా చెలామణి అవుతూ అక్రమ మార్గంలో కాజేసిన విషయమై ‘ఈనాడు’ కొంత కాలంగా ఇస్తున్న వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆక్రమణ లెక్కలు తేల్చే బాధ్యత సీబీసీఐడీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గెజిట్లో ఉన్న రికార్డుల ప్రకారం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. నల్గొండ వక్ఫ్ బోర్డు అధికారుల వద్ద భూముల వివరాలు తీసుకుని అత్యధికంగా ఆక్రమణలకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ‘ఈనాడు’ కథనాలకు స్పందించి ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు అధికారులు సర్వేలు చేయించిన వివరాలను సీబీసీఐడీ అధికారులకు అప్పగించారు.
అధికార పార్టీ నాయకులతో మంతనాలు
సీబీసీఐడీ రంగంలోకి దిగడంతో ఆక్రమణలకు సంబంధం ఉన్న వారు, భూములు తమవేనని అమ్ముకున్న వారు అధికార పార్టీ ముఖ్య నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. విచారణ పక్కదారి పట్టించి తమపైకి కేసులు రాకుండా చూసుకోవడానికి రాజకీయ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
నల్గొండ, దేవరకొండలోనే అధికం
దర్గాలు, ఈద్గాలు, పీర్లకొట్టాల నిర్వహణ, సమాధులకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వక్ఫ్ బోర్డు గెజిట్ ప్రకారం 5 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అందులో అయధికంగా ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. వక్ఫ్ బోర్డు భూమి సాగుచేస్తున్న వారు ఎక్కడా రూపాయి కౌలు చెల్లించడంలేదు. ముతవలీలు, ఇనాందారులమంటూ భూములు ఆక్రమించి అమ్ముకున్నారు. నల్గొండ పట్టణంలోని లతీఫ్ ఉల్లా షా ఖాద్రీ దర్గాకు చెందిన వ్యవసాయ భూమి, దర్గా సమీపంలోని 50 ఎకరాలను ఆక్రమించారని అధికారులు గుర్తించి 400 మందికి నోటీసులు ఇచ్చారు. దర్గా భూమి సర్వేనంబర్లను గ్రామ కంఠం భూమిగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. దర్గా భూములు తమవేనని అమ్ముకుని పత్రాలు రాసి ఇచ్చిన వారిపై 2016లో నల్గొండ వన్టౌన్ పీఎస్లో కేసు నమోదు చేశారు. దేవరకొండలో ఆక్రమించిన వారికి అధికారులు నోటీసులు ఇచ్చినా వక్ఫ్ భూముల్లో నిర్మాణాలు ఆగడం లేదు.
కబ్జాదారుల్లో పోలీసులే అధికం!
నల్గొండ పట్టణంలోని దర్గా, మజీద్ భూములు ఆక్రమించుకున్న వారిలో పోలీసులు అధికంగా ఉన్నారని ప్రచారం ఉంది. వారికి తోడు గతంలో అధికారంలో ఉన్నవారు ప్రస్తుతం అధికార పార్టీలోకి మారి తమ ఆక్రమాలను కొనసాగిస్తున్నారు. పట్టణంలోని ఓ మజీద్ను కమిటీ పేరుతో ఆక్రమించి ఆస్తులను అనుభవిస్తూ వక్ఫ్ బోర్డును పట్టించుకోవడంలేదని ప్రచారం ఉంది. ఈ విషయమై అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. లతీఫ్సాబ్ దర్గా భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ముతవలీల పేరుతో భూములు అమ్ముతున్నారని పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇటీవల వక్ఫ్ బోర్డు, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడానికి వెళ్లగా ఆక్రమణదారులు దాడికి ప్రయత్నించారని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రికార్డులు అప్పగించాం... వక్ఫ్ బోర్డు అధికారి మహ్మద్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలను తేల్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఆక్రమణల వివరాలు, భూముల రికార్డులు, రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే చేసిన నివేదికలను సీబీసీఐడీకి అప్పగించాం. వారి విచారణకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారం అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి