logo

మూడు నెలలుగా మృత్యువుతో పోరాడి.. చివరకు ఓడి..

మూడు నెలలుగా మృత్యువుతో పోరాడిన ఓ యువకుడు చివరకు కన్నుమూశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం పచ్చారుగడ్డకు చెందిన నేతనూరి శ్రవణ్‌కుమార్‌(26), స్నేహితుడు

Published : 22 May 2022 04:40 IST

శ్రవణ్‌కుమార్‌

మాడ్గులపల్లి: మూడు నెలలుగా మృత్యువుతో పోరాడిన ఓ యువకుడు చివరకు కన్నుమూశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం పచ్చారుగడ్డకు చెందిన నేతనూరి శ్రవణ్‌కుమార్‌(26), స్నేహితుడు సాయికుమార్‌తో కలిసి ఫిబ్రవరి నెలలో దిచక్రవాహనంపై కుక్కడం మీదుగా త్రిపురారం వైపు బయలుదేరారు. మార్గమధ్యలో వీరి వాహనం, కారు ఢీకొన్నాయి. ఘటనలో శ్రవణ్‌కుమార్‌ తలకు తీవ్రమైంది. అప్పటి నుంచి మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శనివారం మృతిచెందారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కంచర్ల భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని