రహదారి ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని రావులపెంట గ్రామంలో బీమారం సూర్యాపేట రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
వేములపల్లి, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని రావులపెంట గ్రామంలో బీమారం సూర్యాపేట రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావులపెంటకు చెందిన చిట్యాల జానయ్య(37) క్షౌరదుకాణాన్ని ఉదయం 5గంటలకు తెరచి శుభ్రంగా ఊడ్చుకుని చెత్తను తీసుకెళ్లి రహదారికి ఎదురుగా ఉన్న పెంటకుప్పలో పారవేసేందుకు వెళ్లారన్నారు. చెత్తను పారవేసి రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని కారు జానయ్యను ఢీకొట్టడంతో ఎగిరి పక్కన ఉన్న పెంటకుప్పలో పడిపోయారు. చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో వేములపల్లి శివారులో మృతిచెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నర్సింహారావు పేర్కొన్నారు.
విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొని..
యాదగిరిగుట్ట పట్టణం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి పక్కన విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం మాసాయిపేటలో చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట ఎస్సై శేఖర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బొల్లారం మహేందర్ (45) కొన్నాళ్ల క్రితం యాదగిరిగుట్టకు వలస వచ్చి స్థానిక రైస్ మిల్లులో పని చేస్తున్నారు. తన అత్తగారి గ్రామమైన నమిలెలో దుర్గమ్మ పండగకు శనివారం కుటుంబ సభ్యులతో వెళ్లి, సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై ఒక్కడే తిరుగు ప్రయాణమయ్యారు. మాసాయిపేట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో మహేందర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే మహేందర్ మృతి చెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య యాదగిరిగుట్ట పురపాలికలో అవుట్ సోర్సింగ్పై స్వీపర్గా పని చేస్తుంది. ఇటీవల సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం చేపట్టిన ఇంటి నిర్మాణం తుది దశకు చేరింది. గృహ ప్రవేశానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడం తీరని విషాదం నింపింది.
కొరివి సోమన్న
ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు..
నాగారం: ట్రాక్టర్ పైనుంచి పడి చోదకుడు మృతి చెందిన ఘటన ఈటూరులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరివి సోమన్న (25) తన పొలంలో చెరువు మట్టి పోసేందుకు ట్రాక్టర్ నడుపుతూ అకస్మాత్తుగా వాహనం పైనుంచి జారిపడ్డారు. మడ్గర్ రేకు లేకపోవడంతో టైర్ల కింద పడిపోయారు. వాహనం టైర్లు సోమన్న శరీరం పైనుంచి వెళ్లాయి. స్థానికులు గమనించి అతడిని సూర్యాపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
అశోక్
శాలిగౌరారం: ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన అడ్లూరులో సోమవారం జరిగింది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరుకు చెందిన దేవనబోయిన అశోక్(28) అడ్లూరు నుంచి ట్రాక్టర్లో మట్టిని తరలిస్తున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న అశోక్ వేగంగా వచ్చి రోడ్డుపై ఉన్న రాయిపై ఎక్కించడంతో వాహనం అదుపు తప్పింది. దీంతో అశోక్ ఎగిరి అదే ట్రాక్టర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అశోక్ మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి