నిధిరాత అంతంతే..
ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన లేక దూరమవుతున్నారు. పెట్టుబడి సాయం కింద వచ్చే సొమ్మును సన్న, చిన్న కారు రైతులు కోల్పోతున్నారు. వారిని చైతన్య పరచడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఈకేవైసీ నమోదులో చాలా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే పెట్టుబడి సాయానికి దూరమవుతారు.
నల్గొండలోని మీసేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకుంటున్న రైతు
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన లేక దూరమవుతున్నారు. పెట్టుబడి సాయం కింద వచ్చే సొమ్మును సన్న, చిన్న కారు రైతులు కోల్పోతున్నారు. వారిని చైతన్య పరచడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఈకేవైసీ నమోదులో చాలా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే పెట్టుబడి సాయానికి దూరమవుతారు.
కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ేకేంద్రం ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతల్లో అందిస్తోంది. ఈ పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. బోగస్ పేర్లతో డబ్బు కాజేశారనే ఆరోపణలు ఉండటంతో ఆర్హులను గుర్తించేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. జిల్లాలో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
హుజూర్నగర్ మండలంలో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు
* రైతులు చరవాణి సాయంతో నమోదు చేసుకోవచ్చు.
* పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి ఆధార్ నంబరు రాయాలి. సెర్చ్ బటన్ నొక్కి ఆధార్కు అనుసంధానమైన చరవాణి సంఖ్యను నమోదు చేయాలి.
* ఆ సమయంలో ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే పరిశీలన అనంతరం ఓకే అవుతుంది.
* ఏఈవోల వద్దకు వెళ్లినా.. సొంతంగా లేదా ఏఈవోల సాయంతో ఈకేవైసీ నమోదు చేయడంతో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎక్కువ శాతం రైతులకు గతంలో చరవాణి సంఖ్య ఒకటి ఉంటే ఇప్పుడు మరొకటి ఉంది. ప్రారంభంలో ఏ నంబర్ ఇచ్చారో తెలియని పరిస్థితి. ఈకేవైసీ చేసేటప్పుడు ఓటీపీ నంబర్ దొరకడం లేదు. మీ సేవ కేంద్రానికి వెళ్లి మళ్లీ సరిచేసుకోవాల్సి వస్తుంది.
ఆధార్తో అనుసంధానించని వారు..
ఆధార్తో మొబైల్ అనుసంధానించని వారు, ఇతర ఇబ్బందులున్న వారు తప్పనిసరిగా సమీప మీసేవకు వెళ్లాలి. ఇక్కడ ఈకేవైసీ బయోమెట్రిక్ చేయించుకోవచ్ఛు ఏఏ మండలాల్లో ఎంత మంది బయోమెట్రిక్ పెండింగ్లో ఉందో ఏఈవోలు గ్రామాల్లో జాబితా ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారు కేంద్రానికి వెళ్లే వారు సక్రమంగా స్పందించకపోవడం, ఇతర పనుల ఒత్తిడితో మళ్లీ మళ్లీ రమ్మనడంతో అర్హులు పథకానికి దూరమవుతున్నారు. 2019 ఫిబ్రవరి 10 వరకు పాసుపుస్తకాలు ఉన్న రైతులు మాత్రమే అర్హులని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వం సూచించిన తేదీ తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు ఈ పథకంలో పేర్ల నమోదుకు అనర్హులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా