పాలిసెట్లో ప్రతిభతోనే ఆర్జీయూకేటీ ప్రవేశాలు
పాలిసెట్ రాసే విద్యార్థులకు ఈ ఏడాది రెండు ర్యాంకులు కేటాయించనున్నారు. ఎస్బీటీఈటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఒక ర్యాంకును, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశం కోసం విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఏదో ఒక కోర్సు కోసం మరో ర్యాంకును ఇస్తారు.
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: పాలిసెట్ రాసే విద్యార్థులకు ఈ ఏడాది రెండు ర్యాంకులు కేటాయించనున్నారు. ఎస్బీటీఈటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి ఒక ర్యాంకును, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశం కోసం విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఏదో ఒక కోర్సు కోసం మరో ర్యాంకును ఇస్తారు. రెండేళ్ల ఇంటర్మీడియట్తోపాటు నాలుగేళ్ల ఇంజినీరింగ్ కలిపి సమీకృత బీటెక్ కోర్సు అందించనున్నారు. పాలిసెట్లో సాధించిన ర్యాంకు ఆధారంగా బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు కల్పించనున్నారు. దీంతో పాలిసెట్కు పోటీ పెరుగుతోంది.
దరఖాస్తు ఇలా..
పదో తరగతి మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లలోపు ఎసీ్సీ, ఎసీ్టీలకు 21 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. 12 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తారు. విద్యార్థులు పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు ప్రాతిపదికన ఒక్కో విద్యార్థికి రెండు ర్యాంకులు కేటాయించి వారికి ఆసక్తి ఉన్న కోర్సులో చేరేందుకు అవకాశం కల్పిస్తారు.
జూన్ 4 వరకు అవకాశం
పాలిసెట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమైంది. జూన్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు అందులో ట్రిపుల్ ఐటీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సీటు దక్కించుకోవడానికి పదో తరగతి విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఉమ్మడి జిల్లాలో కొవిడ్కు ముందు 2019 వరకు పదో తరగతిలో వందల సంఖ్యలోనే విద్యార్థులు మాత్రమే పది గ్రేడ్ పాయింట్లు సాధించగా గతేడాది వేల మంది పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. దీంతో పదో తరగతిలో గ్రేడ్ పాయింట్లు కాకుండా పాలిసెట్లో సాధించిన మార్కుల ఆధారంగా బాసర ఆర్జీయూకేటీలో సీీట్లు కేటాయించనున్నారు.
ప్రతిభ ఆధారంగా..
పాలిసెట్లో సాధించిన ప్రతిభ ఆధారంగా పాలిటెక్నిక్, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా, పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో డిప్లొమా కోర్సులు, బాసర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశం పొందొచ్ఛు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పాలిసెట్లో మంచి మార్కులు సాధిస్తే ట్రిపుల్ ఐటీలో చేరడం సులువు అవుతోంది.
జిల్లాల వారీగా పదో తరగతి విద్యార్థుల వివరాలు
సూర్యాపేట : 12,563
నల్గొండ : 19,907
యాదాద్రి : 9,488
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: పెరుమాళ్ల యాదయ్య, ప్రిన్సిపల్, సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల
పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. పాలిసెట్లో ఉత్తీర్ణత మార్కులు సాధించేలా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సమయం తక్కువగా ఉండటంతో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్