హిందూధర్మ పరిరక్షణకు కేసీఆర్ కృషి: మంత్రి
హిందూధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మునగాల
ఈదులవాగుతండాలో ప్రతేక పూజలు చేస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మునగాల గ్రామీణం, న్యూస్టుడే: హిందూధర్మ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మునగాల మండలం ఈదులవాగుతండాలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న స్వంయంభూ వీరాంజరనేయస్వామి, కోట మైసమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. అనంతరం తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు బాలాజీ ఇటీవల ప్రమాదానికి గురవడంతో పరామర్శించారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు తొగరు రమేశ్, రైబస మండల కన్వీనర్ అజయ్కుమార్, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచి బోడ ప్రసాద్, మునగాల ప్యాక్స్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!