logo

హమాలీ సైదులుది హత్యే?

జిల్లా కేంద్రం పరిధిలోని పానగల్‌ ప్రాంతానికి చెందిన హమాలీ కార్మికుడు గజ్జి సైదులుది(25) హత్యేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. శుభకార్యాలకు

Published : 25 May 2022 02:49 IST

మద్యం సీసాలో విషం కలిపి మట్టుబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం పరిధిలోని పానగల్‌ ప్రాంతానికి చెందిన హమాలీ కార్మికుడు గజ్జి సైదులుది(25) హత్యేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. శుభకార్యాలకు మాంసం సరఫరా చేసే సైదులు వద్దకు గత ఏడాది డిసెంబర్‌ 21న వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతనికి క్వార్టర్‌ మద్యం సీసా ఇచ్చారు. ఆ మద్యాన్ని సైదులు అతని సోదరుడి కుమారుడు వెంకటేశంతో కలిసి అదే ప్రాంతంలో ఉన్న బెల్టు షాపులో తాగారు. సైదులు పరిస్థితి విషమంగా ఉండడంతో జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతను మరుసటి రోజు మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సైదులు తాగిన మద్యంలో సైనెడ్‌ కలిసినట్లు ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడికి మద్యం సీసా ఇచ్చింది ఎవరనేది నేటికీి తెలియలేదు. సైదులును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో టూటౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని