నిమ్మకు నీరసం
అధిక ధరకు మార్కెట్లో నిమ్మకాయలు కొనుగోలు చేసినా.. రసం లేక వినియోగదారులకు నీరసం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని ప్రస్తుతం నిమ్మ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.
నకిరేకల్, న్యూస్టుడే
అధిక ధరకు మార్కెట్లో నిమ్మకాయలు కొనుగోలు చేసినా.. రసం లేక వినియోగదారులకు నీరసం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని ప్రస్తుతం నిమ్మ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.
గత అక్టోబరు నుంచి జనవరి వరకు అధిక వర్షాలు, మంచు తేమ కారణంగా నిమ్మ పూత, పిందె దెబ్బతింది. తెగుళ్లు సోకడంతో దిగుబడిపై ప్రభావం పడింది. రాష్ట్రంలో 90 శాతం నిమ్మ ఉమ్మ నల్గొండ జిల్లాలోనే సాగవుతోంది. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. నకిరేకల్లో మార్కెటింగ్ శాఖ నిర్వహణలో ఉన్న రాష్ట్రంలోనే ఏకైక నిమ్మ మార్కెట్కు గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రోజుకు పదివేల బస్తాల(ఒక్కో బస్తా 25 కిలోలు) వరకు వచ్చాయి. ఈ ఏడాది మూడు వేలకు మించకపోవడంతో ఏ మేరలో ప్రభావం పడిందో స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగు చేస్తున్నారు. గతంలో ఇక్కడి పంటలో 80 శాతం వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యేది. ప్రస్తుతం 40 నుంచి 50 శాతం పంట ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. మిగతాది స్థానిక మార్కెట్లకు రిటేల్ అమ్మకాల కోసం వెళుతోంది. దిగుబడులు తగ్గడంతో నిమ్మకు ధర పెరిగింది. వర్షాలు పడినా, ఎండలు తగ్గినా నిమ్మ వినియోగంపై ప్రభావం పడుతుంది. ధర ఉన్నపుడే పంటను అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. ఫలితంగా పారుగాయలు(ఇంకా పక్వానికి రాని) తెంపి మార్కెట్కు తీసుకొస్తున్నారు. కాస్త సైజు ఉన్న కాయలకు ఈ సీజన్లో టిక్కి(25 కిలోలు)కి రూ.2500 నుంచి రూ.3 వేల వరకు ధర పలికింది. పారుగాయలు రూ.700 నుంచి 1200 వరకు పలికింది. దీంతో రైతులు పెద్ద కాయలతోపాటు పారుగాయలను అధికంగా విక్రయానికి తీసుకొస్తున్నారు. చిన్న వ్యాపారులకు ఒక్కో పారుగాయ ఒకటి నుంచి రెండు రూపాయలకు లభిస్తే వారు మార్కెట్లో వినియోగదారులకు రూ.5 నుంచి 10 పైగా విక్రయించడం గమనార్హం.
నకిరేకల్ మార్కెట్కు వస్తున్న అధికంగా చిన్నసైజు నిమ్మకాయలు ఉన్న బస్తాలు
అధిక ధరతో కొనుగోలు చేసినా..
- గునగంటి రాజు, హోటల్ యజమాని, నకిరేకల్
మా హోటల్లో రోజు 300 నిమ్మకాయల వరకు అవసరం ఉంటుంది. అధిక ధర పెట్టి కొనుగోలు చేసినా కాయల్లో రసం ఉండటం లేదు.రెండు కాయలు పిండినా చెంచాడు రసం రావడంలేదు. ఇలాంటి నిమ్మకాయలు ఎందుకు తెస్తున్నారని వినయోగదారులు వాపోతున్నారు.
ఫొన్లు చేసి అడుగుతున్నారు
- యానాల కృష్ణారెడ్డి, నిమ్మ రైతు సంఘం ప్రతినిధి
ఇటీవల హైదరాబాద్ కూకట్పల్లి నుంచి ఒక వినియోగదారుడు ఫొన్ చేశారు. మార్కెట్కు అన్ని రసం లేని నిమ్మకాయలే వస్తున్నాయి. రసం ఉన్న కాయలు మీ వద్ద లేవా అని అడిగారు. మూడేళ్ల నుంచి నిమ్మకు ధర లేక తీవ్రంగా నష్టపోయాం. ప్రస్తుతం ధర ఉండటంతో అర, ముప్పావు సైజు ఉన్న కాయలు తెంపుతున్నార. ధర ఎపుడు తగ్గుతుందోననే ఆందోళన చిన్నసైజు రసం లేని కాయలు మార్కెట్కు రావడానికి కారణం. వాటికీ వ్యాపారులు ధర ఇస్తున్నారు.
పక్వానికి వచ్చిన కాయల్లోనే పోషక విలువలు - రావుల విద్యాసాగర్, ఉద్యాన క్లస్టర్ అధికారి
పక్వానికి వచ్చిన కాయల రసంలోనే పోషక విలువలు ఉంటాయి. రైతులు వీటినే మార్కెట్లకు పంపడం మంచిది. మన జిల్లా నిమ్మకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఇంత పేరున్న ఈ ప్రాంతం నుంచి రసం లేని నిమ్మకాయలు ఎగుమతి అయితే అది మన భవిష్యత్తుకు అంత మంచిది కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?