పచ్చని ఒడ్డు.. ప్రగతికి మెట్టు
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది. రోడ్ల వెంట, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు.. ఇలా ఎక్కడ
ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్లో పాలేరు ఒడ్డున హరితహారం నర్సరీ
నూతనకల్, న్యూస్టుడే: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది. రోడ్ల వెంట, ప్రభుత్వ భూములు, కార్యాలయాలు.. ఇలా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా మొక్కలు నాటి సంరక్షించాలని నిర్ణయించింది. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత ఏర్పడి మానవాళికి మేలు జరుగుతుందని భావిస్తోంది. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చిస్తోంది. అధికారులు చొరవ చూపితే ఏటి ఒడ్డును కూడా ఆహ్లాదానికి, పచ్చదనానికి నెలవుగా మార్చవచ్చునని ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ ఉదంతం చాటిచెబుతోంది. ఇదే మాదిరిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని పాలేరు ఒడ్డును మార్చాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
ఏపూర్లో పచ్చదనం
ఏపూర్లో శ్మశానవాటిక, నర్సరీ, పల్లె ప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అనువైన స్థలం లేకపోవడంతో గ్రామంలోని పాలేరు ఒడ్డును వినియోగించుకోవాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది. పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, హరితహారం నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణానికి పూనుకుంది. పదేళ్లలో ఏటి ఒడ్డు పచ్చదనానికి అడ్డాగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ కార్యాలయానికి కాకుండా ఏటి ఒడ్డున ఉన్న పల్లె ప్రకృతివనానికి ఎక్కువగా వెళ్తుండటం గమనార్హం.
సూర్యాపేట జిల్లాలో..
పాలేరు ఒడ్డులు కంపచెట్లతో నిండి నిరుపయోగంగా మారాయి. నూతనకల్ మండలం తాళ్లసింగారం, యడవెల్లి, వెంకేపల్లి, గుండ్లసింగారం, లింగంపల్లి, మాచినపల్లి, బిక్కుమళ్ల, మద్దిరాల మండలం ముకుందాపురం, జి.కొత్తపల్లి, మామిండ్లమడవ, ఆత్మకూర్(ఎస్) మండలంలో పాతర్లపహాడ్, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూర్, మిడతనపల్లి, కొత్తగూడెంలో ఏటివెంట భూములు దర్శనమిస్తున్నాయి. ఆయా స్థలాల్లో ఏటికి రెండువైపులా ఒడ్డున మొక్కలు నాటి ఏపుగా పెంచగలిగితే.. గలగలపారే గోదావరి జలాల వెంట ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
శ్రమిస్తే సత్ఫలితం..!
పాలేరు ఏటి ఒడ్డు వెంట రైతుల భూముల సరిహద్దులు గుర్తించటానికి రెవెన్యూ అధికారులు కాస్త శ్రమించాలి. ఒడ్డున నాటిన మొక్కలు పెంచడానికి రైతులనే సంరక్షకులుగా నియమించి వారికి రెండేళ్లు ఉపాధి హామీ పథకం కింద వేతనాలు అందించాలి. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా శ్రమిస్తే చెట్టుమీది ఫలం రైతులదేనని భరోసా కల్పిస్తే ఏటి వెంట పచ్చని వనాలు కళకళలాడతాయి.
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
-ఇందిర, ఎంపీడీవో, నూతనకల్
పాలేరు ఒడ్డున ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతేడాది రెవెన్యూ అధికారులను సంప్రదించాం. రైతుల ఆధీనంలో ఉన్నాయని బదులిచ్చారు. ఈ భూములను ఉపాధి హామీ పథకం కింద చదును చేసి మొక్కలు నాటిస్తే కూలీలకు పనులు కల్పించడంతోపాటు ఏటి వెంట పచ్చదనం వృద్ధి చెందుతుంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠా అరెస్టు
[ 20-04-2024]
జిల్లాలో వరుసగా గొలుసు దొంగతనాలకు, చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. -
ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆలేరు నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?