ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం
దేశీయంగా డిమాండ్కు అనుగుణంగా పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశం దిగుమతులు చేసుకుంటున్న ఆహార పదార్థాలలో ఆయిలపామ్ వాటా
మోత్కూరు మండలం పాలడుగు నర్సరీలో పెంచుతున్న ఆయిల్పామ్ మొక్కలు
ఆలేరు, న్యూస్టుడే: దేశీయంగా డిమాండ్కు అనుగుణంగా పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారతదేశం దిగుమతులు చేసుకుంటున్న ఆహార పదార్థాలలో ఆయిలపామ్ వాటా అధికంగా ఉంది. దేశీయంగా సాగయ్యే నూనెగింజల పంటలు, ఆయిల్పామ్తో కేవలం 30శాతం అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. మిగతా 70 శాతం అవసరాలకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ విపణిలో తరచూ ఏర్పడుతున్న సంక్షిష్ట పరిస్థితుల నేపథ్యంలో నూనె దిగుమతులను తగ్గించుకునేందుకు అయిల్పామ్ సేద్యం పెంచాలని, ఇందుకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఆరు వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ప్రోత్సాహకాలు ఇలా...
ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు 57 ఆయిల్పామ్ మొక్కలు అవసరం అవుతాయి. ఒక మొక్క ధర రూ.196. రాయితీ పోను కేవలం రూ.33లకే ప్రభుత్వం అందిస్తోంది. భవిష్యత్తులో మొక్కలను కూడా పూర్తి ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీ రైతులకు నూరుశాతం, బీసీలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం రాయితీతో బిందుసేద్యం పరికరాలు అందిస్తోంది. ఒక కుటుంబం 12.5 ఎకరాల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. పంట ఎదుగుదల సమయంలోనూ కొంత నగదును ప్రోత్సాహకంగా అందించే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
లాభాలు..
ఎకరాకు ఏటా రూ.2 లక్షల ఆదాయం వస్తుందని, నికర ఆదాయం రూ. లక్ష మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి ఏడాది కొంత పెట్టుబడి అవసరం కాగా తర్వాతి ఏడాది నుంచి కాత వచ్చే వరకు పెట్టుబడి అవసరం అంతగా ఉండదు. మొదటి మూడేళ్లు మొక్కల మధ్య అంతర పంటలుగా మిర్చి, పెసలు, మొక్కజొన్న, మినుములు, కూరగాయలు, అరటి, జామ, బొప్పాయి పంటలు సాగు చేయవచ్ఛు ఆరో ఏడాది తర్వాత అంతర పంటగా కోకో పండివచ్ఛు అకాల వర్షం, ఈదురు గాలులు, వడగండ్ల వర్షం నుంచి ఆయిల్పామ్ మొక్కలు తట్టుకుంటాయి.
సాగు.. కొనుగోలు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఈసారి ఆరువేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు ఆలేరు, చౌెటుప్పల్, మోత్కూరు, వలిగొండ, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం) క్లస్టర్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించింది. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో కనీసం వెయ్యి ఎకరాల్లో పండించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మోత్కూరు మండలం పాలడుగులో నర్సరీలో నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు. దిగుబడులను ఆయిల్ ఫెడ్ సంస్థనే కొనుగోలు చేస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
-కె.రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్ఫెడ్ సంస్థ
ఆయిల్పామ్ సాగును విరివిగా ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడి నేలలు, వాతావరణం ఆయిల్పామ్ సాగుకు చాలా అనుకూలం. సంప్రదాయ నూనె గింజల పంటల కన్నా 4-5 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. మొక్కలు నాటడం నుంచి సస్యరక్షణ చర్యలు, మార్కెటింగ్ వరకు ఆయిల్ఫెడ్ సంస్థ అండగా ఉంటుంది. రైతులు సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి ఆదాయం, లాభం చేకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి