నల్గొండ, యాదాద్రిలో ప్రయోగాత్మక మిల్లింగ్
యాసంగి ధాన్యాన్ని సాదారణ బియ్యంగా మార్చే ప్రక్రియపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సీజన్ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాదారణ బియ్యంగా మిల్లింగ్ చేస్తే అధిక శాతం నూకలుగా మారి నష్టం
హుజూర్నగర్: ఆరబెట్టిన యాసంగి ధాన్యం
హుజూర్నగర్, న్యూస్టుడే: యాసంగి ధాన్యాన్ని సాదారణ బియ్యంగా మార్చే ప్రక్రియపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ సీజన్ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాదారణ బియ్యంగా మిల్లింగ్ చేస్తే అధిక శాతం నూకలుగా మారి నష్టం వస్తుందని మిల్లర్లు స్పష్టం చేశారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సాదారణ బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని ఎఫ్సీఐ తేల్చిచెప్పటంతో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే నూకశాతాన్ని తేల్చేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీని కోసం ప్రతి జిల్లాలో రెండు, మూడు మిల్లుల్లో ప్రయోగాత్మక (టెస్టింగ్) మిల్లింగ్ చేపడుతున్నారు. ఈ పనిని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలోని మైసూర్లో ఉన్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ)కి అప్పగించింది. ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులతో కూడిన బృందాలు జిల్లాల్లో ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని 40 మిల్లుల్లో ప్రయోగాత్మక మిల్లింగ్ చేపట్టారు. రెండో విడత ఈనెల 27 తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ గురువారం ప్రకటించింది. అందులో భాగంగా నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో మిల్లింగ్ ఈనెల 28, 29 తేదీల్లో చేయనున్నారు. సీఎఫ్టీఆర్ఐకి చెందిన ప్రధాన శాస్త్రవేత్త సత్యేంద్రరావు నేతృత్వంలో అదే సంస్థకు చెందిన మరోక అధికారి, ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వారు ఆయా తేదీల్లో రెండు జిల్లాల్లో పర్యటించి రెండు, మూడు మిల్లుల్లో ప్రయోగాత్మక మిల్లింగ్ చేపట్టనున్నారు. ఎక్కువ వరి రకాలు ఎక్కడ పండుతాయో ఆ జిల్లాల్లో ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో అధిక శాతం సన్న రకాలుంటాయని కాబట్టి మిగిలిన జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో నూకల శాతం పెరిగిందని మిల్లర్లకు చేకూరిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి రావటానికి సమయం పడుతుందని సీఎఫ్టీఆర్ఐ సంస్థ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..