ఆన్లైన్ మూల్యాంకనం వైపు అడుగులు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఇటీవల అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్
నల్గొండ ఎన్జీ కళాశాలలో త్వరలో ప్రారంభం
నల్గొండ టౌన్, న్యూస్టుడే
నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అటానమస్ కళాశాలల్లో ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఇటీవల అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ప్రతి కళాశాలలో ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు సమాచారం. అందులో భాగంగా నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మూల్యాంకనం వల్ల వర్సిటీల్లో కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం.
పలు వర్సిటీల్లో ఈ విధానం
ఆన్లైన్ మూల్యాంకనం విధానం ప్రస్తుతం రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, ఎంజీయూ తదితర వర్సిటీలో అమలులో ఉంది. ఈ వర్సిటీలు పరీక్షలు నిర్వహించిన కొన్ని రోజులకే పారదర్శకంగా ఫలితాలు విడుదల చేసి విద్యార్థుల ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఇదే విధానం ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ భావించి, అందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. మొత్తంగా త్వరలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఆన్లైన్ మూల్యాంకనం విధానం అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ప్రయోజనాలు
* ఆన్లైన్ మూల్యాంకనం తప్పులు జరిగే అవకాశాలు తక్కువ.
* జవాబు పత్రాలు భద్రపర్చేందుకు ఇబ్బందులు ఉండవు.
* మూల్యాంకనానికి ఎగ్జామినర్లు రానవసరం లేదు.
* పరీక్ష ఫలితాలు త్వరగా వెల్లడించే అవకాశం ఉంటుంది.
* విద్యార్థులు తాను రాసిన జవాబు పత్రంలో సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలకు ఫీజు చెల్లించి ఆ జవాబుపత్రం త్వరగా పొందే అవకాశం ఉంటుంది.
* జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు టీఏ, డీఏలు చెల్లించనక్కరలేదు.
మా కళాశాలలో ప్రారంభిస్తాం
- చంద్రశేఖర్, ప్రిన్సిపల్, ఎన్జీ కళాశాల
ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆన్లైన్ మూల్యాంకనం మా కళాశాలలో త్వరలో ప్రారంభిస్తాం. ఈ విధానం ద్వారా పరీక్షల ఫలితాలు త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. జవాబు పత్రాలు భద్రపర్చేందుకు రిస్క్ తక్కువగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో కరోనా వ్యాధి విస్తరణ ఉన్నా ఆన్లైన్లో పేపర్ వాల్యూయేషన్కు వెసులుబాటు ఉంటుంది. ఆన్లైన్ మూల్యాంకనంతో పారదర్శకత పెరుగుతుంది.
ఫలితాలు త్వరగా ఇవ్వొచ్చు
- నాగరాజు, సీవోఈ, ఎన్జీ కళాశాల
ఆన్లైన్ మూల్యాంకనం పద్ధతి ద్వారా పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వొచ్చు. ప్రస్తుతం మా కళాశాలలో వివిధ కోర్సుల్లో 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి సెమిస్టర్లో పరీక్షలు పెట్టి ఎగ్జామినర్లతో వాల్యూయేషన్ చేయించి ఫలితాలు ఇవ్వాలంటే ఆలస్యమవుతుంటుంది. వీటన్నింటికి ఆన్లైన్ మూల్యాంకనం పరిష్కార మార్గం. విద్యార్థులకు పలు విధాలా మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్