logo

రుణం.. వీధి వ్యాపారులకు వరం

వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి, ఆత్మనిర్బర్‌ పథకం కింద రుణాలు మంజూరు చేస్తోంది. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని పురపాలికల్లో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా

Published : 27 May 2022 03:06 IST

సూర్యాపేటలో పండ్ల క్రయ విక్రయాలు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి, ఆత్మనిర్బర్‌ పథకం కింద రుణాలు మంజూరు చేస్తోంది. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని పురపాలికల్లో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులను గట్టెక్కించేందుకు బ్యాంకుల ద్వారా రూ.10 వేలు మంజూరు చేశారు. మొదట్లో ఈ మొత్తాన్ని తీసుకోవడానికి కొందరే ముందుకురాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు. వీధి వ్యాపారం చేసే చోటుకు వెళ్లి వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేశారు. దీంతో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి వీలు కల్పించి రుణాలు అందించారు.
రెండో విడతకు చర్యలు
మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుడికి రెండో విడత రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి రెట్టింపు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 10 వేలు తీసుకొని వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. అర్హులుగా సగం మంది కూడా తేలకపోగా, తీసుకున్న మొత్తాన్ని చెల్లించేలా ప్రోత్సహించడంతోపాటు మళ్లీ రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పించారు. దీంతో వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఈ రుణం ఏటా పెరుగుతుండటంతో కొంతమంది లబ్ధిదారులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ కింద రూ. 20 వేలు రుణాలు మంజూరు చేసేందుకు మందుకొచ్చింది.
ఎంతమందికి లబ్ధి అంటే
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో మొదటి విడతలో 29,555 మందికి లబ్ధి చేకూరగా, రెండో విడత వచ్చే సరికి ఆ సంఖ్య తగ్గింది. ఇందులో 7,773 మందికి రుణం మంజూరు చేయాల్సి ఉంది. 1920 మంది ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడత రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా అధికారులు పలుమార్లు సమీక్ష నిర్వహించి బ్యాంకర్లకు గడువు విధిస్తున్నారు. గడువు ప్రకారం రుణాలు అందిస్తే చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని