రుణం.. వీధి వ్యాపారులకు వరం
వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి, ఆత్మనిర్బర్ పథకం కింద రుణాలు మంజూరు చేస్తోంది. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని పురపాలికల్లో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా
సూర్యాపేటలో పండ్ల క్రయ విక్రయాలు
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి, ఆత్మనిర్బర్ పథకం కింద రుణాలు మంజూరు చేస్తోంది. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని పురపాలికల్లో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులను గట్టెక్కించేందుకు బ్యాంకుల ద్వారా రూ.10 వేలు మంజూరు చేశారు. మొదట్లో ఈ మొత్తాన్ని తీసుకోవడానికి కొందరే ముందుకురాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు. వీధి వ్యాపారం చేసే చోటుకు వెళ్లి వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. దీంతో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి వీలు కల్పించి రుణాలు అందించారు.
రెండో విడతకు చర్యలు
మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుడికి రెండో విడత రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి రెట్టింపు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 10 వేలు తీసుకొని వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. అర్హులుగా సగం మంది కూడా తేలకపోగా, తీసుకున్న మొత్తాన్ని చెల్లించేలా ప్రోత్సహించడంతోపాటు మళ్లీ రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పించారు. దీంతో వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఈ రుణం ఏటా పెరుగుతుండటంతో కొంతమంది లబ్ధిదారులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆత్మనిర్భర్ కింద రూ. 20 వేలు రుణాలు మంజూరు చేసేందుకు మందుకొచ్చింది.
ఎంతమందికి లబ్ధి అంటే
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో మొదటి విడతలో 29,555 మందికి లబ్ధి చేకూరగా, రెండో విడత వచ్చే సరికి ఆ సంఖ్య తగ్గింది. ఇందులో 7,773 మందికి రుణం మంజూరు చేయాల్సి ఉంది. 1920 మంది ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడత రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా అధికారులు పలుమార్లు సమీక్ష నిర్వహించి బ్యాంకర్లకు గడువు విధిస్తున్నారు. గడువు ప్రకారం రుణాలు అందిస్తే చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!