వైద్యుల ఆందోళన.. విరమణ
నల్గొండ జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ రాజకుమారి వైఖరికి నిరసనగా గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. నల్ల బ్యాడీ…్జలు ధరించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెలవు రోజుల్లో కూడా
ప్రిన్సిపల్ వైఖరిపై జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న వైద్యులు
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: నల్గొండ జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ రాజకుమారి వైఖరికి నిరసనగా గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన నిర్వహించారు. నల్ల బ్యాడీ…్జలు ధరించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వహించాలని 56 మంది వైద్యులకు శ్రీముఖాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. వైద్యులు నిర్వర్తించే ప్రతి పనిలో ఆమె జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయారు. బయోమెట్రిక్ వేసిన వారికి కూడా వేతనాల్లో కోతలు విధిస్తూ వేధింపులకు పాల్పడడం విచారకరమని చెప్పారు. వైద్యులకు ఇచ్చిన శ్రీముఖాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిపాలన విభాగంపై అనుభవం లేని కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కాగా, వైద్యులకు ఇచ్చిన శ్రీముఖాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ రాజకుమారి చెప్పడంతో నిరసన తాత్కాలికంగా విరమించారు. ఆసుపత్రిలో జరిగిన నిరసనకు రాష్ట్ర వైద్యుల టీచింగ్ సంఘం నాయకులు అన్వర్, తిరుపతిరావు, కిరణ్, కృష్ణప్రసాద్, సూర్యాపేట సంఘం నాయకులు కిరణ్, గిరిధర్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాబురావు, శ్రీధర్, స్వర్ణలత మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుల సంఘం నాయకులు యుగేందర్, నగేష్, సురేష్, పార్థసారథి, ఇందిరా ప్రియదర్శిణి, కవిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్