ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వల వెంట ప్రకృతి వనాలు: కలెక్టర్
ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు రెండువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో గుర్తించిన ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు, మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
సూర్యాపేటలో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, చిత్రంలో అదనపు
కలెక్టర్లు మోహన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, ఆర్డీవో రాజేంద్రప్రసాద్
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు రెండువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో గుర్తించిన ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు, మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. హరితహారం కార్యక్రమంపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని జలవనరుల శాఖ భూముల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు పొందాలన్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట 50 మీటర్లలో మెగా పల్లె ప్రకృతి వనాలు, ఎస్సారెస్పీ కాల్వ వెంట 20 మీటర్లలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎనిమిదో విడత హరితహారంలో 85 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం విధించుకున్నామని చెప్పారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం
సూర్యాపేట పట్టణం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 21 క్రీడా ప్రాంగణాలను గుర్తించామని, 29 ప్రాంతాల్లో అంచనాలు తయారుచేశామన్నారు. 13 చోట్ల పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. జూన్ 2 నాటికి ప్రారంభించేందుకు క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మోహన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, డీఎఫ్వో ముకుందరెడ్డి, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, కిశోర్కుమార్, వెంకారెడ్డి, డీఆర్డీవో కిరణ్కుమార్, ఏపీడీ పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
రుణాలు సకాలంలో అందించాలి
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: సకాలంలో రుణాలు అందేలా బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. 2021-22 నాలుగో త్రైమాసిక రుణ ప్రణాళికపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకర్లతో మాట్లాడారు. రైతులకు వ్యవసాయ రుణ లక్ష్యం రూ.1,935.57 కోట్లు కాగా రూ.1,862.62 కోట్లు (96.23 శాతం) అందజేశామన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీపై, ముద్రా రుణాలను అలసత్వం చేయకుండా త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. అనంతరం 2022-23 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, లీడ్ బ్యాంకు మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల