అస్తవ్యస్తం.. గందరగోళం
నల్గొండ పురపాలిక నుంచి నీలగిరి అభివృద్ధి ప్రాధికార సంస్థ (నుడా)గా మారినప్పటి నుంచి పట్టణంలో రహదారుల విస్తరణ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ పనులు అస్తవ్యస్తంగా.. గందరగోళంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా పాలనాధికారితో పాటు
నీలగిరి అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపం!
హైదరాబాద్ రహదారిలో ఓ సూపర్మార్కెట్ ముందు రహదారి నిర్మాణంలో వాడిన ఎర్రమట్టి
ఈనాడు, నల్గొండ: నల్గొండ పురపాలిక నుంచి నీలగిరి అభివృద్ధి ప్రాధికార సంస్థ (నుడా)గా మారినప్పటి నుంచి పట్టణంలో రహదారుల విస్తరణ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ పనులు అస్తవ్యస్తంగా.. గందరగోళంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా పాలనాధికారితో పాటు పుర కమిషనర్ పనులు పర్యవేక్షిస్తున్నా గుత్తేదారులు ఇవేవి పట్టించుకోకుండా పనులు చేస్తున్నారని సంబంధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ రహదారిలో రహదారి నిర్మాణం సాగుతుండగా... కంకర వేయాల్సిన చోట ఎర్రమట్టితో రహదారులు నిర్మిస్తున్నారు. అన్ని వరుసల్లో నిర్ణయించిన విధంగా కంకర మిశ్రమాన్ని వాడాల్సి ఉండగా...కింద ఎర్రమట్టి వేసి పైన కంకర వేస్తూ ఎర్రమట్టిని కప్పేస్తున్నారు. దీనిపై కమిషనర్ రమణాచారిని ‘ఈనాడు’ వివరణ కోరగా... క్వాలిటీ ఇంజినీర్లతో పాటూ హైదరాబాద్ స్థాయి అధికారులందరూ ఈ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని, పనుల్లో నాణ్యత లోపించడమనేది ఉండదని స్పష్టం చేశారు.
మరోవైపు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రహదారిలో జరుగుతున్న నకిరేకల్ - నల్గొండ - నాగార్జునసాగర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు సైతం ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. రహదారి విస్తరణలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ దిమ్మెలు మురుగు కాల్వ అవతల ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ట్రాన్స్కో సిబ్బంది నేరుగా మురుగు కాల్వలోనే ఏర్పాటు చేశారు. దీంతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పనుల్లోనూ నాణ్యత లోపిస్తుందని ఏకంగా సంబంధిత ఇంజినీర్లే పెదవి విరుస్తున్నారు. కట్టిన రెండు మూడు నెలలకే బ్రిడ్జిలు, డ్రైనేజీలకు అప్పుడే పగుళ్లు రావడం గమనార్హం. ఇప్పటికైనా ఎన్హెచ్ఏఐ అధికారులు పనుల నాణ్యత విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
దేవరకొండ రహదారిలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు కాల్వకు పగుళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్