మధ్యాహ్నం 12 గంటలకే ఓపీ బంద్
చేతిలో రక్త పరీక్షల నివేదికతో నిరీక్షిస్తున్న మహిళ పేరు సూరమ్మ. భువనగిరి పట్టణంలో నివసిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం శనివారం ఉదయం 9.30 గంటల వరకు జిల్లాకేంద్రాసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు రక్త పరీక్ష
జిల్లా కేంద్రాసుపత్రిలో సమయపాలన పాటించని వైద్యులు
చేతిలో రక్త పరీక్షల నివేదికతో నిరీక్షిస్తున్న మహిళ పేరు సూరమ్మ. భువనగిరి పట్టణంలో నివసిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం శనివారం ఉదయం 9.30 గంటల వరకు జిల్లాకేంద్రాసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు రక్త పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేశారు. దీంతో రక్త పరీక్ష చేయించుకొని నివేదికతో వచ్చేసరికి మధ్యాహ్నం 12.30 గంటలైంది. అప్పటికే వైద్యులు వెళ్లిపోవడం, ఓపీ గది మూసిఉండటంతో చూసీచూసీ ఆమె ఇంటికి వెళ్లారు.
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో ఓపీ(ఔట్ పేషెంట్స్) విభాగంలో వైద్యులు సమయ పాలన పాటించకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని చీటీ నమోదు కౌంటర్ వద్ద బోర్డు ఏర్పాటుచేశారు. కానీ, ఉదయం పది గంటలకు వస్తున్న వైద్యులు మధ్యాహ్నం 12 గంటలకే ఇంటికి వెళ్తున్నారు. 12 గంటలయితే చాలు ఓపీలో కొన్ని విభాగాల గదులు మూసి ఉంటున్నాయి. మరికొన్ని వార్డులో తెరిచి ఉంచినా వైద్యులు, వైద్యసిబ్బంది కానరారు. శనివారం జిల్లాకేంద్రాసుపత్రిలో మధ్నాహ్నం 12.15 గంటల తర్వాత ఓపీలో వైద్యులు లేకపోవడంతో అక్కడికి వచ్చిన రోగులు తిరిగి వెళ్లారు. కొంతమంది రోగులు ఉదయం ఓపీలో వైద్యుడికి చూపించుకొన్నారు. రక్త పరీక్షలకు సిఫార్సు చేయడంతో ఆ పరీక్షలు చేయించుకొని నివేదికతో వస్తే అప్పటికే వైద్యులు వెళ్లిపోవడంతో ఎవరికి చూపించాలో తెలియక, దిక్కుతోచక నిరీక్షించారు. మధ్యాహ్నం పన్నెండు తర్వాత వచ్చిన రోగులు ఓపీ విభాగంలో ఎవరూ లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అత్యవసర విభాగంలోని క్యాజువాలిటీ వద్దకు వెళ్లాలని సిబ్బంది వారికి సూచించారు. అప్పటికే క్యాజువాలిటీ వద్ద పది మందికి పైగా రోగులు వరుసలో నిల్చున్నారు. అప్పటికే అత్యవసర చికిత్స కోసం, ఇతర వైద్యసేవలకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.
మంత్రి హెచ్చరించినా.. మారని తీరు
ఇటీవల జిల్లాకేంద్రాసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సందర్శించి విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయవద్దని సమీక్ష సమావేశాల్లో, సందర్శన సమయంలో వైద్యులకు సూచించారు. అయినా వైద్యులు సమయపాలన పాటించకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వైద్యులు వార్డుల్లో ఉంటున్నారు: చిన్ననాయక్, డీసీహెచ్
ఓపీ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఆ తర్వాత వైద్యులు వార్డుల్లో రౌండ్స్, ఇతర సేవలు అందించేందుకు విధులు కొనసాగిస్తున్నారు. 12 తర్వాత వచ్చే రోగులకు క్యాజువాలిటీ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ