logo

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేద్దాం

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా తెలియజేయడానికి ప్రతి బూత్‌ స్థాయిలో నెలనెలా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు.

Published : 29 May 2022 06:03 IST

మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, వేదికపై నూకల నర్సింహారెడ్డి, మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, కంకణాల శ్రీధర్‌రెడ్డి, గోపి,  గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్‌, వీరెల్లి చంద్రశేఖర్‌

నీలగిరి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా తెలియజేయడానికి ప్రతి బూత్‌ స్థాయిలో నెలనెలా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు. శనివారం నల్గొండలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్‌ స్థాయిలో కమిటీల సభ్యులకు ప్రభుత్వ పథకాల అమలు తీరును చెప్పాలన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు గోపి, మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్‌, వీరెల్లి చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని