మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం
మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులకు ప్లేమ్ ఎంటర్పైమ్షిప్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అవగాహన సమావేశాన్ని కాగడతో ప్రారంభిస్తున్న కలెక్టర్ రాహుల్ శర్మ, తదితరులు
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులకు ప్లేమ్ ఎంటర్పైమ్షిప్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో వి-హబ్ పూర్తిగా రాష్ట్ర ఐటీ, సీ విభాగం పరిధిలో పని చేస్తుందని తెలిపారు. మహిళల భాగస్వామ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమించే దిశగా కృషి చేయాలని సూచించారు. వి-హబ్ అనేది ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలతో కలిసి పని చేస్తుందని వివరించారు. మహిళలు తమ ఆలోచనలకు పదునుపెట్టి స్టార్టప్ కంపెనీల స్థాపనకు ముందుకొచ్చినట్లయితే వి-హబ్ ద్వారా ప్రభుత్వం సహాయక సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. టి-హబ్ను ప్రారంభించేందుకు ఈ నెల 28న రాష్ట్ర ఐటీ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కార్యకమంలో వి-హబ్ డైరెక్టర్ శ్రీదేవి, మేనేజర్ ఆయుష్, పరిశ్రమ శాఖ మేనేజర్ భారతి, డీఈవో భిక్షపతి, గణపతిరావు, గఫూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ స్వగృహలో ప్రభుత్వమే సౌకర్యాలు కల్పిస్తుంది
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: రాజీవ్ స్వగృహ టౌన్ షిప్లో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామంలో రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు శుక్రవారం కలెక్టరేట్లో అయిదో రోజు భౌతిక వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ స్వగృహలో ప్లాట్లు, గృహాలను కొనుగోలు చేసేవారికి బ్యాంకు రుణ సౌకర్యం ఉందని తెలిపారు. నల్గొండ పట్టణానికి అతి సమీపంలో ఉన్న టౌన్షిప్లోని ఓపెన్ ప్లాట్లు చదరపు గజానికి రూ.7 వేలు, పాక్షిక నిర్మాణమైన గృహాలు నిర్మాణ దశలు అనుసరించి రూ.7 వేల నుంచి రూ. 12,500 వరకు అప్ సెట్ ధరగా నిర్ణయించినట్లు వివరించారు. రాజీవ్ స్వగృహ టౌన్షిప్లో ఇళ్లు, ప్లాట్లు పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, విశాలమైన రహదారులు కలిగి ఉన్నాయని తెలిపారు. రెండో విడత వేలంలో అయిదు రోజులకు రూ.4.14 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలిపారు. ఇంకా వేలంలో పాల్గొనదలచినవారు ప్రాజెక్టు మేనేజర్ షఫియుద్దీన్ 91543 39209 నంబరులో సంప్రదించవచ్చని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీనివాస్ ఇతర అధికారులు, ఔత్సాహకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు