ప్లాస్టిక్ను వీడు...పర్యావరణాన్ని కాపాడు..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మార్కెట్కు వెళ్లి.. ఇంటికి వచ్చేటప్పటికీ ఒక్కొక్కరి చేతుల్లో రెండుకు పైగా ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వస్తుంటారు. ఇంతలా మనలో భాగమైన ప్లాస్టిక్ కవర్లు అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి ఎంతో హాని
120 మైక్రాన్లలోపు కవర్లను నిషేధించిన ప్రభుత్వం
జులై 1 నుంచి అమల్లోకి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మార్కెట్కు వెళ్లి.. ఇంటికి వచ్చేటప్పటికీ ఒక్కొక్కరి చేతుల్లో రెండుకు పైగా ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వస్తుంటారు. ఇంతలా మనలో భాగమైన ప్లాస్టిక్ కవర్లు అటు పర్యావరణానికి, ఇటు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయినా ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అధికారుల అలసత్వం వెరసి నిషేధిత ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పురపాలికలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధంపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రస్తుతం జులై 1 నుంచి 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
గతంలో 50 మైక్రాన్లలోపు ఉండే కవర్లను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఒకసారి వాడి పడేయకుండా కవర్లను మళ్లీ వాడాలనే ఉద్దేశంతో దశల వారీగా పలుచటి కవర్లపై ఎక్కు పెడుతున్న ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దీన్ని 75 మైక్రాన్ల లోపు కవర్లను నిషేధించగా.. ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి 120 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులపై సైతం ఈ జులై నుంచి నిషేధం అమల్లోకి వస్తున్నట్లు గతంలోనే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, ఐస్క్రీమ్ పుల్లలు, ప్లాస్లిక్ చెంచాలు, ముళ్ల చెంచాలు, ప్లేట్లు, కత్తులు, థర్మాకోల్తో చేసిన అలంకరణ వస్తువులు, వ్రాపింగ్ స్టిక్కర్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పీవీసీ బ్యానర్లు, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్స్ వంటి వాటిని పూర్తిగా నిషేధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
విపరీతంగా పెరిగిన వాడకం..
దేశంలోని ప్రతి మనిషి సగటున ఏడాదికి 11కిలోలకు పైగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను వాడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చిచెప్పింది. 2022 నాటికి ఈ వాడకం 20 కిలోలకు పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. కూరగాయలు, పండ్లు, టిఫిన్లు, పూలు వంటివి తీసుకెళ్లేటప్పుడు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అధికంగా వాడుతున్నారు. ఇది పర్యావరణానికి పెనుభూతంగా మారుతోంది. చదువుకున్న యువత నుంచి కూలీల వరకు ప్రతి ఒక్కరు చేతిలో రెండు, మూడు కవర్లలో వస్తువులు తీసుకెళ్లడం సర్వసాధారణమైంది. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే వారు సంచులు తీసుకోకుండా వస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ వంటి ప్రధాన పట్టణాల్లో ఏటా మూడున్నర టన్నులకు పైగా పురపాలిక సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
చైతన్య పరుస్తున్నా... - కోడిరెక్క జయంతి, మిర్యాలగూడ.
నేను బయటికి వెళ్లిన ప్రతిసారి జనపనార సంచిని తీసుకెళ్తాను. ఏ వస్తువు కొన్నా అందులోనే వేసుకుని తీసుకొస్తా. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన పెంచుకుని ఐదేళ్లుగా కవర్లకు దూరంగా ఉంటున్నా. ప్లాస్టిక్ నిషేధానికి నా వంతుగా పలువురిని చైతన్య పరుస్తున్నా. మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ వారు ప్లాస్టిక్పై చేసే పోరాటంలో నేను సైతం భాగస్వామినవుతున్నా. సంస్థ ఆధ్వర్యంలో అనేక మందికి ఉచితంగా జనపనార సంచులు పంపిణీ చేశాం. ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం చేసే దుకాణదారులకు ప్రోత్సాహం అందిస్తుంటాం.
ప్లేటు, గ్లాసు వెంట తీసుకెళ్తా.. - మిట్టపల్లి సురేష్ గుప్తా, నల్గొండ
నేను గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్లినా స్టీలు, ప్లేటు, గ్లాసు తీసుకెళ్తా. శుభకార్యాల్లో భోజన సమయంలో వారు ఇచ్చే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా నేను తీసుకెళ్లిన ప్లేటులోనే ఆహారం తీసుకుంటా. నిత్యం భుజానికి వస్త్రంతో చేసిన సంచిని ధరిస్తా. వస్తువులు కొనుగోలు చేస్తే ఆ సంచిలోనే వేసుకుని వస్తాను. ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటా. ప్రభుత్వం సైతం పాఠశాలలో విద్యార్థులకు చిన్నతనం నుంచే ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి. నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’