స్వయం ఉపాధికి బాటలు
నల్గొండ జిల్లా పరిషత్, న్యూస్టుడే: సృష్టిలో దాగియున్న సృజననని లోకానికి చూపిస్తుంది కళ..ఆ కళనే ఆసరాగా చేసుకొని కొందరు మహిళలు స్వయం ఉపాధికి బాటలు పర్చుకుంటున్నారు. మగవారికి దీటుగా కుటుంబ ఆర్ధికాభివృద్ధికి
నల్గొండ జిల్లా పరిషత్, న్యూస్టుడే: సృష్టిలో దాగియున్న సృజననని లోకానికి చూపిస్తుంది కళ..ఆ కళనే ఆసరాగా చేసుకొని కొందరు మహిళలు స్వయం ఉపాధికి బాటలు పర్చుకుంటున్నారు. మగవారికి దీటుగా కుటుంబ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట పట్టణాలకు చెందిన ఇద్దరు మహిళలు విభిన్నతే ధ్యేయంగా మగ్గం, జర్దోషి వంటి ప్యాషన్ డిజైన్ రంగంలో రాణిస్తూ తనలో దాగియున్న సృజనని చాటుతున్నారు. ఒక్కరు ఉపాధి కల్పిస్తూ..మరొక్కరూ మహిళల ఆరోగ్యంపై నృత్యశిక్షణ నిర్వహిస్తూ ఆదాయం సముపార్జిస్తూ పలువురి మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
ఆరోగ్యం కన్నా ఐశ్వర్యమేమి లేదు: - ఎం.ఉమ, ఏరోబిక్స్ శిక్షకురాలు సూర్యాపేట
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంకంటే మించిన ఐశ్వర్యమేమిలేదు. ఇది చాలా మంది ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అందుకు తగిన సాధన చేస్తున్నారు. నేను గత ఆరేళ్ల క్రితమే ముంబయిలో ఏరోబిక్స్లో శిక్షణ తీసుకున్నాను. నేను నేర్చుకున్న కళనే ఇతరలకు నేర్పించాలనే లక్ష్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొదటగా సూర్యాపేట పట్టణంలో ఏరోబిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశాను. ఇప్పటికే రెండు బ్యాచులు శిక్షణ పూర్తయ్యింది. ప్రస్తుతం 45 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆన్లైన్లో సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఏరోబిక్ అంటే సంగీతం, నృత్యంతో కూడిన యోగా అని చెప్పవచ్చు. దీని ద్వారా శారీరక దేహదారుఢ్యత పెంచుకొనే అవకాశంతోపాటు, సన్నగా, నాజుకుగా, బరువు తగ్గించుకొనే అవకాశం ఉంది. శిక్షణ తరగుతల ద్వారా తన ఆరోగ్యం పదిల పర్చుకోవడంతోపాటు కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. ఇప్పటి వరకు రెండు వందల మంది మహిళలకు ఆరోగ్యంపై తర్ఫీదు ఇవ్వడం జరిగింది.
ఎరోబిక్ శిక్షణ ఇస్తున్న శిక్షకురాలు ఎం.ఉమ
25 మందికి ఉపాధి: మైలపురపు ధనలక్ష్మి నల్గొండ
సృజనాత్మక కళాకృతులతో కూడిన వస్త్రాలకు డిమాండ్ పెరిగింది. నిశ్చితార్థాలు, వివాహాలకు, సారి ఫంక్షన్లు ఇతర వేడుకలకు మహిళలు, యువతులు ప్రత్యేకంగా దస్తులు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇలాంటి చీరలు, జాకెట్ల తయారీకి కుట్టు, మగ్గం పనుల్లో నైపుణ్యం ఉండాలి. దీనిని పదేళ్ల క్రితమే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా మగ్గం వర్క్ పరిచియం చేసి నల్గొండలో దుకాణం ఏర్పాటు చేశాను. అందమైన ఆకృతులతో మహిళలను ఆకర్షించేలా డిజైన్ చేస్తూ ఆర్థికంగా బాటలు పదిలపర్చుకున్నారు. మా ఆయన కూడా పనుల్లో సహకారం అందిస్తారు. అతివల మనస్సుకు తగినట్లు మగ్గం, జర్దోషి, జరి, వర్క్లు చేయించడంతోపాటు జాకెట్లు కుట్టించడం జరుగుతుంది. డిజైన్ను అనుసరించి ఛార్జి చేస్తాం. ఏడాదికి రూ.70 లక్షల వ్యాపారం నడుస్తోంది. నిత్యం 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను ప్రతి నెలా రూ.40 నుంచి రూ. 50వేల వరకు ఆర్థిక వెసులుబాటు లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా