బలవర్థక ఆహారం.. విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సకల్పించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత పది రోజులుగా ప్రభుత్వం పీఎం పోషణ్ పథకాన్ని అమలు పరుస్తుంది. విద్యార్థుల్లోని రక్త హీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు మధ్యాహ్న భోజన పథకంలో
భువనగిరి పట్టణం, ఆలేరు-న్యూస్టుడే
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సకల్పించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గత పది రోజులుగా ప్రభుత్వం పీఎం పోషణ్ పథకాన్ని అమలు పరుస్తుంది. విద్యార్థుల్లోని రక్త హీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం స్థానంలో విటమిన్లు పోర్టిపికేషన్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేస్తుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ1, బీ2, బీ3, బీ6, బీ12, జింక్ను మిళితం చేసి తయారు చేసిన బియ్యం షెల్స్ను సన్న బియ్యంలో కలపడం ద్వారా బియ్యం పోషక విలువలను పెంచారు. క్వింటా సాధారణ బియ్యంకు ఒక కిలో బియ్యం గింజలను పోలిన విటమిన్ షెల్స్ను మిళితం చేసి సర్కార్ బడులకు పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం ద్వారా తయారు చేసిన భోజనం రుచితో పాటు బలవర్ధకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు భావిస్తున్నారు.
కోడిగుడ్డు ధర పెంపు
మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో వారంలో మూడు రోజులు గుడ్డు వడ్డిస్తున్నారు. ధరల పెరుగుదల కారణంగా చాలా పాఠశాలల్లో వంట ఏజెన్సీల వారు మాత్రం ఒకటి, లేదా రెండు రోజులు మాత్రమే గుడ్డు వడ్డిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గుడ్డుకు ఇచ్చే మొత్తాన్ని రూ.4 నుంచి రూ.5కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథకమికోన్నత, ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనంలో ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో కచ్చితంగా గుడ్డును వడ్డించాల్సి ఉంటుంది.
అన్ని పాఠశాలల్లో అమలు
- కానుగుల నర్సింహా, డీఈవో, యాదాద్రి భువనగిరి
విటమిన్లు మిళితం చేసిన బియ్యంను మదాహ్న భోజన పథకం అమలులో ఉన్న పాఠశాలలకు పంపిణీ చేశాం. మెనూ పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. గుడ్డు ధరను రూ.1 పెంచాం. వారంలో మూడు రోజులు గుడ్డుతో పాటు మెనూ అమలయ్యేలా చర్యలు చేపడతాం.
పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోని మెనూ..
ప్రభుత్వం రూపొందించిన మధ్యాహ్న భోజనం మెనూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. కోడిగుడ్డు వడ్డించినందుకు గతంలో ప్రభుత్వం ఒక గుడ్డుకు రూ.4 చెల్లించేది. ఈనెల 13 నుంచి కోడిగుడ్డుకు రూ.5 చెల్లిస్తున్నప్పటికి నిర్వాహకులు విద్యార్థులకు వడ్డించడం లేదు. భువనగిరి పట్టణంలోని బాగాయత్ హైస్కూల్లో శుక్రవారం 120 మంది విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడం గమనార్హం. పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. వెజ్బిర్యానీతో పాటు కూరగాయల కూర వడ్డింపులో నిర్లక్ష్యం కొనసాగుతుండటం గమనార్హం.
వారం మెనూ
సోమవారం - అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు
మంగళవారం - అన్నం, కూరగాయల కూర, రసం
బుధవారం - అన్నం, ఆకుకూర, పప్పు, కోడిగుడ్డు
గురువారం - అన్నం, పప్పుచారు
శుక్రవారం - అన్నం, కూరగాయల కూర, రసం, గుడ్డు
శనివారం - వెజ్బిర్యానీ, ఆలు కుర్మ, రసం
జిల్లాల వారీగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వివరాలు
నల్గొండ - 1,454 - 1,31,543
యాదాద్రి - 712 - 64,181
సూర్యాపేట - 950 - 77,277
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండలో 4... భువనగిరిలో 5
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శుక్రవారం నల్గొండ లోక్సభ పరిధిలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. -
పండుటాకులకు ఇంటివద్దే ఓటు
[ 20-04-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ హక్కు వినియోగించుకునేలా చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. -
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.