ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్టవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ తిరుపతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
సెల్టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆలకుంట శ్రీను
బెజ్జంకి, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్టవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ తిరుపతి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన ఆలకుంట వెంకటయ్య కొన్నేళ్ల క్రితం బెజ్జంకికి వలస వచ్చి ఒడ్డెర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శ్రీను(23)కు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం కాగా కూతురు(18నెలలు) ఉంది. ఏడాదిగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుల పెద్దలు సర్ది చెప్పారు. మూడు నెలల క్రితం శ్రీను భార్య, కూతురితో కలిసి కూలీ పనికి నల్గొండకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గకపోవడంతో రాజేశ్వరి కూతురితో తల్లిగారింటికి చేరుకుంది. దీంతో నాలుగు రోజుల క్రితం బెజ్జంకికి వచ్చిన శ్రీను కులపెద్దలకు విషయం తెలిపాడు. శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం సమీపంలో పంచాయతీ నిర్వహించి వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. అనంతరం ఎడ్లబండి కూడలిలో శ్రీనుతో అతడి మామ, మరో బంధువు గొడవ పడగా స్థానికులు అడ్డుపడి ఇళ్లకు పంపించారు. భార్య కాపురానికి రాకపోవడం, గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను సెల్ టవర్ ఎక్కుతుండగా బంధువులు గమనించి వారించినా వినకుండా కిందకు దూకాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న ఎస్ఐ తిరుపతి ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి సోదరుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?