కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జాతీయ లోక్అదాలత్ ద్వారా ఇరువర్గాల పరస్పర ఆమోదంతో సత్వర న్యాయం అందుతోంది. ఈ నెల 26న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు.
ఈనెల 26న జిల్లా వ్యాప్తంగా నిర్వహణ
ఆలేరు జూనియర్ సివిల్జడ్జి కోర్టులో లోక్అదాలత్ కార్యక్రమం (పాతచిత్రం)
ఆలేరు, న్యూస్టుడే: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జాతీయ లోక్అదాలత్ ద్వారా ఇరువర్గాల పరస్పర ఆమోదంతో సత్వర న్యాయం అందుతోంది. ఈ నెల 26న జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. దీనిపై కక్షిదారులు అవగాహన పెంచుకుని కేసులను సయోధ్యతో పరిష్కారం చేసుకోవడం ఉత్తమ మార్గమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
లోక్ అదాలత్ అంటే...
వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి ఏర్పడిన ఉపన్యాయ వేదికలే లోక్ అదాలత్. రెగ్యులర్ న్యాయస్థానాల్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి వీటిని నిర్వహిస్తారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశ్యం. సిట్టింగ్/పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి చైర్మన్గా, ఒక న్యాయవాది, మరో స్వచ్ఛంద సంస్థ సభ్యుడు సభ్యులుగా లోక్ అదాలత్ సాగుతుంది.
ఏమేమి పరిష్కరిస్తారంటే..
లోక్ అదాలత్లో సివిల్, ప్రమాద బీమా, రుణాల రికవరీ, చిట్ఫండ్ కేసులు, కుటుంబ వివాదాలు, ఫోన్ బకాయిలు, ఆబ్కారీ కేసులు పరిష్కరిస్తారు. కేసులు నమోదు కాని ప్రీలిటిగేషన్ కేసులనూ పరిష్కరిస్తారు. సంబంధిత కక్షిదారులకు ముందుగానే నోటీసులు జారీచేసి వారిని లోక్ అదాలత్కు పిలుస్తారు. అక్కడ ఇరువర్గాలకు అవగాహన కల్పించి, రాజీ కుదిర్చి కేసులు పరిష్కరిస్తారు. ఇందుకోసం లీగల్ సర్వీసెస్ అధికారులు, పోలీసులు, న్యాయవాదుల సహకారం తీసుకుంటారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లే. ఒకరిది గెలుపు, మరొకరిది ఓటమి అనే భావన ఉండదు. చాలాకాలంగా కోర్టుల చుట్టూ తిరిగే వారికి ఇదే ఉత్తమమైన మార్గమని నిపుణుల సూచన.
అప్పీలుకు అవకాశం లేకుండా అంతిమ తీర్పు
జాతీయ న్యాయ సేవాసంస్థ ఆదేశాల మేరకు మూడు నెలలకోసారి దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. జిల్లా న్యాయసేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ కోర్టుల్లో పెండింగ్ కేసులతో పాటు ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తారు. వీటికి సంబంధించి ఇరుపక్షాలు ఒక అవగాహనకు వచ్చి రాజీపడితే అక్కడికక్కడే తీర్పులు ఇస్తారు. రెగ్యులర్ కోర్టులలో ఎలాగైతే కేసులు పరిష్కరించి తీర్పు ఇస్తారో, వాటికి ఏవిధంగా చట్టబద్ధత ఉంటుందో.. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులకూ ఉంటుంది. రెగ్యులర్ కోర్టులలో ఇచ్చిన తీర్పులకు సంబంధించి పైకోర్టులకు అప్పీలు చేసుకునే వీలుంటుంది. కానీ, లోక్ అదాలత్ తీర్పులకు అప్పీలు చేసుకునే అవకాశం లేదు. అప్పీలు చేయడానికి వీలులేని న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందేందుకు లోక్ అదాలత్లను వినియోగించుకోవాలని కక్షిదారులకు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కేసుల పరిష్కారం ద్వారా ఆర్థిక భారం, విలువైన సమయాన్ని కాపాడుకోవచ్చు. రెగ్యులర్ కోర్టుల్లో కట్టిన రుసుంలు తిరిగి పొందవచ్చు.
డబ్బు, సమయం ఆదా: ఇద్రిస్అలీ, ఎస్సై, ఆలేరు
లోక్అదాలత్లో కక్షిదారులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు సమయం పొదుపు అవుతుంది. రెగ్యులర్ కోర్టుల్లో చెల్లించిన రుసుంలన్నీ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న తర్వాత తిరిగి పొందవచ్చు. వీటి ద్వారా వచ్చిన తీర్పులతో ఇరువర్గాలు మళ్లీ కోపతాపాలకు వెళ్లకుండా ఒకరితోమరొకరు సమన్వయంతో కలిసిపోతారు. అక్కడితో గొడవలు శాశ్వతంగా సద్దుమణిగే అవకాశాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!