కలవరం.. ఆపై సంతోషం
ఉమ్మడి జిల్లాలోని దేవరకొండతో పాటు కృష్ణపట్టి మండలాలైన చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, పెద్దవూర, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచేర్వు, చింతలపాలెం, దామరచర్ల, అడవిదేవులపల్లి లాంటి మారుమూల మండలాల్లో పలువురు ఉపాధ్యాయులు అసలు విధులు వదిలి స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని గతంలో శాఖ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందని ఓ కీలక అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. దేవరకొండ, చందంపేట, నేరేడు
గుంటిపల్లి పాఠశాల
ఈనాడు, నల్గొండ, న్యూస్టుడే, దేవరకొండ: ఉమ్మడి జిల్లాలోని దేవరకొండతో పాటు కృష్ణపట్టి మండలాలైన చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, పీఏపల్లి, పెద్దవూర, పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచేర్వు, చింతలపాలెం, దామరచర్ల, అడవిదేవులపల్లి లాంటి మారుమూల మండలాల్లో పలువురు ఉపాధ్యాయులు అసలు విధులు వదిలి స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని గతంలో శాఖ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందని ఓ కీలక అధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి మండలాల్లోని ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టి మారుమూల ప్రాంతాల్లోని తండాల్లో ఓ మోస్తారుగా చదువుకున్న వారిని విద్యావలంటీర్లుగా నిబంధనలకు విరుద్ధంగా నియమించుకొని వారికి నామమాత్రంగా డబ్బులు ఇస్తూ అధికారులను ‘మేనేజ్’ చేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయినా ఉన్నతాధికారులకు నెలనెలా మాముళ్లు అందుతుండటంతో ఈ విషయంపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం ఇటీవలే మొదలైన దేవరకొండ డివిజన్లో పనిచేసే కొంత మంది ఉపాధ్యాయులు అప్పుడే డిప్యూటేషన్ వచ్చిందని చెబుతూ విధులకు హాజరుకావడం లేదు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న వాదనలున్నాయి.
కీలకంగా ‘ఆ ఒక్కడు’
దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లో పనిచేసే దాదాపు 50 మంది వరకు ఉపాధ్యాయులు చింతపల్లి, దేవరకొండ, మల్లేపల్లి ప్రాంతాల్లో స్థిరాస్థి వ్యాపారం చేస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా గత అయిదేళ్లుగా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ప్రస్తుతం డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు ఇన్ఛార్జ్గా ఉన్న ఓ అధికారి సాయంతో బడులకు పోకుండా మేనేజ్ చేస్తున్నారని తెలిసింది. సదరు అధికారి అయిదారేళ్లుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నతాధికారులకు, స్థిరాస్తి, చిట్టీల వ్యాపారం చేస్తూ కాలం గడుపుతున్న కొంత మంది ఉపాధ్యాయులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. జిల్లా ఉన్నతాధికారి ఎవరైనా ఈయనే నమ్మినబంటుగా వ్యవహరించి ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయులపై ఈగ వాలకుండా చూసుకుంటారనే పేరుంది. గతంలో జిల్లా స్థాయి జడ్పీ అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వ బడులను ఇక్కడి ఉపాధ్యాయులు నిర్వీర్యం చేస్తున్నారని వెల్లడించినా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి మారుమూల ప్రాంతంలో పనిచేసే గురువులపై సరైన నిఘా పెట్టాల్సిన అవసరముంది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ప్రభుత్వం నుంచి తనకింకా పూర్తి వివరాలు రాలేదని, వచ్చిన తర్వాత స్పందిస్తానని ‘ఈనాడు’కు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో బడుల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కారణం ఏంటంటే?
ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ డివిజన్ చందంపేట మండలంలోని గుంటిపల్లిలో పనిచేస్తున్న జావేద్ అలీ అనే ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా స్థిరాస్తి వ్యాపారాలు, ఇతర రాజకీయ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. సదరు బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారుకు నివేదిక అందజేసింది. అయినా సంబంధిత అధికారులు మాత్రం సదరు ఉపాధ్యాయుడికి సంబంధించి కేవలం రెండు ఇంక్రిమెంట్లు కోత విధించి తిరిగి అదే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.
దేవరకొండ డివిజన్లోని ఉపాధ్యాయుడి అక్రమాల ఆధారంగానే వివాదాస్పద జీవో ప్రకటన
‘‘ విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు వెల్లడించాలి. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి’’
- ఉపాధ్యాయుల ఆస్తులపై ప్రభుత్వం చేసిన ప్రకటన.. (ఆపై సర్కారు ఈ జీవోను నిలిపివేసింది)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు