బతుకు బండి.. బహుకష్టమండి
భారీగా పెరిగిన ధరలు ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలుసూర్యాపేటలో నివాసముంటున్న వీరస్వామి దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఎనిమిదో తరగతి చదివే కూతురు పాఠశాల ఫీజు గతేడాది రూ.41 వేలు. ఈ సారి రూ. 52 వేలకు పెరిగింది. యానిఫాం,
భానుపురి, నందికొండ- న్యూస్టుడే
భారీగా పెరిగిన ధరలు ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలుసూర్యాపేటలో నివాసముంటున్న వీరస్వామి దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఎనిమిదో తరగతి చదివే కూతురు పాఠశాల ఫీజు గతేడాది రూ.41 వేలు. ఈ సారి రూ. 52 వేలకు పెరిగింది. యానిఫాం, పుస్తకాలు, బూట్లు, బ్యాగుల ధర అదనం. వీరస్వామి ఆఫీసుకు ద్విచక్రవాహనంపై వెళ్తారు. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. కొన్నాళ్లుగా విపరీతంగా పెరిగిన నిత్యావసరాల భారం మరింత అదనం. ఏడాది వ్యవధిలో ఇంటి ఖర్చు రూ. 3 వేలపైనే పెరిగింది. అన్ని ధరలు పెరిగినా ఇద్దరి జీతాల్లో మార్పు లేదని ఆయన వాపోయారు. ఈ నెలలో ఎదురైన ఖర్చుతో మూడు నెలల వరకూ కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని ‘న్యూస్టుడే’కు తెలిపారు.
జూన్ నెల మధ్య తరగతి కుటుంబాలను బెంబేలెత్తిస్తోంది. రెండేళ్లలో అన్ని రకాల వస్తువులు, వంట సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నియంత్రణ లేకుండా పెరిగిన స్కూల్ ఫీజులతో సతమతమవుతున్న వేతన జీవులకు కొండెక్కి కూర్చున్న నిత్యావసరాల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఆదాయంలో పెరుగుదల లేకపోవడంతో మొత్తం కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. ఇంట్లో చదివే పిల్లలు ఇద్దరు ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి వర్ణణాతీతం. జూన్ వచ్చేసరికి పెరిగిన ఖర్చులతో ఆర్థిక పరిస్థితి చేయి దాటి పోవడం తట్టుకోలేక కొందరు తల్లిదండ్రులు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబాన్ని నడిపేందుకు అప్పులు చేస్తున్నారు. కొందరు వ్యక్తిగత అవసరాలు, వినోద ఖర్చుల్లో కోత విధిస్తున్నారు.
ఒక్కో కుటుంబంపై అదనపు భారం రూ. 5 వేలు
కరోనాతో వ్యాపారం దెబ్బతిని ఈ రెండేళ్ల వ్యవధిలో ప్రజల ఆదాయాల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.80 నుంచి రూ.100కు చేరాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు అదుపు తప్పాయి. వంటగ్యాస్, పప్పు, ఉప్పు, నూనె పాలు సహా అనేక వస్తువుల ధరలు సగటున 10 నుంచి 80 శాతంపైనే పెరిగాయి. ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు పెంచింది. ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే ఏటా 5 నుంచి 10 శాతం పెంపు వీటికి అదనం. ఇవన్నీ మధ్య తరగతి కుటుంబాలపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇంటి ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఒక్కో కుటుంబంపై నెలకు సుమారు రూ.5వేల భారం అదనంగా పడుతోంది. బడులు ప్రారంభమయ్యే నాటికి ఎదురవుతున్న ఖర్చులతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
పెరుగుతున్న ఖర్చులు: శ్రీనివాస్, సూర్యాపేట
ఖర్చులన్నీ అదుపు తప్పుతున్నాయి. రూ.200కు వారం సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు వారానికే రూ500 అవుతోంది. నూనె, పాల ధర పెరిగింది. ఆఫీసుకు వెళ్లొచ్చేందుకు ఏడాదిన్నర కిందట పెట్రోలుకు నెలలో రూ.2 వేల ఖర్చయ్యేది. ఇప్పుడు రూ. 3 వేలవుతోంది. ఇలా అన్నీ ధరలు పెరగడంతో, ఒక్కోసారి ఇంటిని ఎలా నెట్టుకురావాలో.. ఏం ఖర్చులు తగ్గించుకోవాలో అర్థమవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM