బీపీఎం కుమారుడి మాయాజాలం
నిరక్షరాస్యులు, నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నూతన అకౌంట్ల పేరుతో అకౌంట్లో ఉన్న డబ్బులు స్వాహా చేసిన ఘటన నేరెడుగొమ్ము మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, సర్పంచి తెలిపిన వివరాల ప్రకారం...
ఉపాధి కూలీల డబ్బులు స్వాహా.. దేహశుద్ధి చేసిన స్థానికులు
బీపీఎం నుంచి గ్రామస్థులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు
నేరెడుగొమ్ము - దేవరకొండ, న్యూస్టుడే: నిరక్షరాస్యులు, నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నూతన అకౌంట్ల పేరుతో అకౌంట్లో ఉన్న డబ్బులు స్వాహా చేసిన ఘటన నేరెడుగొమ్ము మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, సర్పంచి తెలిపిన వివరాల ప్రకారం... గుడిపల్లి పోస్టాఫీసుకు చెందిన బీపీఎం ఎస్.కె.జహంగీర్ మండలంలో ఉపాధి కూలీలకు తపాలా కార్యాలయం అకౌంట్లు తెరుస్తానని ఎంపీడీవో దగ్గరి నుంచి అనుమతి తీసుకున్నారు. బ్యాంక్ ఖాతా లేని ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ వద్ద పోస్టాఫీసు సిబ్బందితో నూతన ఖాతా తెరుచుకోవాలని ఆయా పంచాయతీల సిబ్బంది సూచించారు. మండలంలోని బచ్చాపురంలో 130, పెద్దమునిగల్లో 175, నేరెడుగొమ్ములో 250 ఖాతాలను ఉపాధి కూలీలకు జహంగీర్ కుమారుడు అప్రోజ్ కొద్ది రోజులుగా తీయించారు. ఒక్కో ఖాతా నుంచి రూ.200 నుంచి రూ.250 వసూలు చేస్తూ నగదు మీ ఖాతాలోనే ఉంటాయని నమ్మించి వేలి ముద్రల సాయంతో రూ.180 వరకు స్వాహా చేశారు. అంతేకాకుండా నేరెడుగొమ్ములో ఇద్దరి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు స్వాహా చేయడంతో గుర్తించిన సదరు ఖాతా దారులు అప్రోజ్ను ప్రశ్నించారు. భయాందోళనకు గురైన అప్రోజ్ గుట్టుచప్పుడు కాకుండా వారి నగదును ముట్టజెప్పి విషయం బయటికి రాకుండా చూసుకున్నారు. కాగా శనివారం తిమ్మాపురం 110 ఖాతాలను తీయగా వారి ఖాతాల్లో నుంచి కూడా నగదు మాయం అవుతుందని గుర్తించిన ఉపాధి కూలీల పిల్లలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. అదే గ్రామంలోని కోనేటి రజిత అకౌంట్ నుంచి రూ.1,500, బోడ బుచ్చయ్య అకౌంట్ నుంచి రూ.1,900, బోడ ఆంజనేయులు అకౌంట్ నుంచి రూ.2,500 తన వ్యక్తిగత ఖాతాలకు దారి మళ్లించినట్లు గుర్తించారు. హుటాహుటిన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వెళ్లగా అప్పటికే అక్కడే ఉన్న అప్రోజ్ను నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 665 నూతన ఖాతాలు తెరవగా, సుమారు రూ.3.5 లక్షలు నగదు దారి మళ్లినట్లు గుర్తించారు. దీంతో గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి కంప్యూటర్, బయోమెట్రిక్ డివైజ్, అతను కూలీల నుంచి వసూలు చేసిన డబ్బులు స్వాధీనం చేసుకొని పరికరాలను, డబ్బులను సర్పంచి భద్రపర్చారు. బీపీఎం కుమారుడు జరిగిన సంఘటనను తండ్రికి వివరించడంతో తండ్రి జహంగీర్ హుటాహుటిన గ్రామానికి చేరుకొని పెద్ద మనుషులతో రాజీ కుదుర్చుకునేందుకు బేరసారాలు జరిపారు. గ్రామస్థులు ససేమిరా అనడంతో అక్కడి నుంచి జారుకున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఝాన్సిలక్ష్మిబాయి, ఎంపీడీవో
బీపీఎం అక్రమాలకు పాల్పడినట్లు తిమ్మాపురం గ్రామం నుంచి సమాచారం అందింది. వెంటనే అతనిపై కేసు పెట్టాలని గ్రామ సర్పంచి కుంభం కేశవులుకు సూచించా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?