రైతును ఏమార్చి.. ఖాతా నుంచి సొమ్ము చోరీ
నగదు నిల్వ వివరాలు తెలుసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన రైతును ఏమార్చి.. అతని ఏటీఎం కార్డును మార్చి ఖాతా నుంచి డబ్బులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన రైతు బి.భిక్షమయ్య ఈ నెల 18న నకిరేకల్ పోలీసు స్టేషన్ ఎదురు వీధిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వచ్చారు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలో జమ అయింది లేని
నకిరేకల్, న్యూస్టుడే: నగదు నిల్వ వివరాలు తెలుసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన రైతును ఏమార్చి.. అతని ఏటీఎం కార్డును మార్చి ఖాతా నుంచి డబ్బులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన రైతు బి.భిక్షమయ్య ఈ నెల 18న నకిరేకల్ పోలీసు స్టేషన్ ఎదురు వీధిలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వచ్చారు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు ఖాతాలో జమ అయింది లేనిది తెలుసుకునేందుకు నిల్వ వివరాల కోసం అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సాయం కోరారు. అతనికి కార్డు ఇచ్చి పిన్ నంబరు చెప్పారు. ఆ వ్యక్తి నగదు నిల్వను పరిశీలించి ఖాతాలో డబ్బులు ఉన్నా లేవని రైతుకు అబద్దం చెప్పి, అదే సమయంలో భిక్షమయ్య ఏటీఎం కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును రైతు చేతిలో పెట్టి అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత మూడు నాలుగు రోజుల్లో నల్గొండ, హైదరాబాద్లోని ఏటీఎం ద్వారా రైతు ఖాతా నుంచి రూ.1,17,800 గుర్తు తెలియని వ్యక్తి 11 దఫాలుగా డ్రా చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతుకు ఖాతాలో డబ్బులు పూర్తిగా లేవని తెలియడంతో అనుమానం వచ్చి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించారు. అది తనది కాదని, టి.శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించానని బాధిత రైతు భిక్షమయ్య శనివారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ ఏ.వెంకటయ్య నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కె.రంగారెడ్డి శనివారం తెలిపారు.
పూడ్చిన శవానికి పోస్టుమర్టం
తిప్పర్తి,న్యూస్టుడే: పూడ్చిన శవాన్ని వెలికితీసి శవపంచనామా చేసిన ఘటన తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన జంతిక సుధాకర్ సమీప గ్రామమైన గోదోరిగూడేనికి చెందిన శ్రావ్యను ఆరేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రసవం కోసం ఈ నెల 14న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన శ్రావ్య అస్వస్థతకు గురై అదేరోజు మృతిచెందారు. బలహీనంగా ఉండటంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని పోస్టుమర్టం చేయకుండానే అంత్యక్రియలు పూర్తిచేశారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని.. అల్లుడే కారణమని శ్రావ్య తల్లి యాకాలపు ముత్యాలమ్మ తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమర్టం చేయాలని నిర్ణయించారు. మామిడాలలో శ్రావ్యను పూడ్చిన చోటకు వెళ్లి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్సై సత్యనారాయణల సమక్షంలో శనివారం ఫోరెన్సిక్ వైద్యబృందం పోస్టుమర్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఓటమే లక్ష్యం: బీవీ రాఘవులు
[ 19-04-2024]
భాజపా మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పోటీ చేస్తుందిని పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి