ధాన్యాన్ని పరీక్షించిన సీఎఫ్టీఆర్ఐ బృందం
చిట్యాలలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో ధాన్యాన్ని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) బృందం సోమవారం పరిశీలించింది.
చిట్యాల, న్యూస్టుడే: చిట్యాలలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో ధాన్యాన్ని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) బృందం సోమవారం పరిశీలించింది. యాసంగి సీజన్లో తెలంగాణలో వచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసినపుడు వచ్చిన బియ్యంలో నిర్ణీత మోతాదుకు మించి నూక శాతం పెరుగుతుందని ఇది తమకు నష్టదాయకమని రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. దీనిపై క్షేత్రస్థాయిలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేసినపుడు బియ్యం, నూక, పొట్టు, తవుడు, రాళ్లు ఎంతశాతం వస్తాయనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి సీఎఫ్టీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త శ్రుతిపాండే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం చిట్యాలకు వచ్చింది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో ఎంటీయూ 1010 రకం(దొడ్డు రకం), చింట్లు(సన్నరకం) ధాన్యాన్ని 4 టన్నుల చొప్పున మర ఆడించి, తద్వారా వచ్చే బియ్యం, నూక, పొట్టు, తవుడు, రాళ్ల నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. సోమవారం ఎంటీయూ 1010 రకం మర ఆడించారు. మంగళవారం మిగిలిన రకాన్ని మర ఆడించనున్నారు. తాము క్షేత్రస్థాయిలో సేకరించిన నమూనాలను తమ ప్రయోగశాలలో పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నామని సీఎఫ్టీఆర్ఐ బృందం పేర్కొంది. కార్యక్రమంలో సీఎఫ్టీఆర్ఐ బృందం సభ్యులు షకీబ్, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, యాదయ్య, పౌరసరఫరాల శాఖ నాణ్యత నియంత్రణ అధికారులు జి.సైదులు, జీసీ మల్లారెడ్డి, జి.రామచంద్రం, జిల్లా డీసీఎస్వో వి.వెంకటేశ్వర్లు, ఎసీఎస్వో నిత్యానందం, పౌర సరఫరాల శాఖ డీఎం డి.నాగేశ్వరరావు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, చిట్యాల మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తేరటుపల్లి హనుమంతు, జిల్లాకు చెందిన పలువురు రైసుమిల్లర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్