logo

తెరాస పాలనకు చరమగీతం పాడాలి: తెదేపా

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన తెరాస పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న అన్నారు.

Published : 28 Jun 2022 04:55 IST


చింతపల్లిలో సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న, జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన తెరాస పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జోత్స్న అన్నారు. మండల కేంద్రంలో సోమవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌తో కలిసి ఆ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించి, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు. జిల్లాలో రెండు నెలల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, వచ్చే ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌, దేవరకొండ ఎమ్మెల్యే స్థానాలను గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌, సర్పంచి రాటకొండ రుద్రమాదేవి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయ్‌ నాయక్‌, పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వస్కుల కృష్ణయ్య, మండల అధ్యక్షుడు యాచారం రవీందర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి కుకుడాల శ్రీను, మాజీ సర్పంచి యాదయ్య, ఆనంద్‌, రమేష్‌, సిద్దిక్‌బాబా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని